విడుదలైన 'త్రివిక్రమన్‌' ట్రైలర్

- September 02, 2016 , by Maagulf
విడుదలైన 'త్రివిక్రమన్‌' ట్రైలర్

త్రివిక్రమపాండ్యన్‌ అనే రాజు మరణానికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవడానికి వెళ్లిన బృందం ఎదుర్కొన్న పరిస్థితులు, పరిణామాల సమాహారంగా సోషియా ఫాంటసీగా రూపొందిన చిత్రం 'త్రివిక్రమన్‌' . రవిబాబు, నాగబాబు, శ్రీ (ఈరోజుల్లో ఫేమ్‌), ధనరాజ్‌, ప్రవీణ్‌రెడ్డి, అమూల్యారెడ్డి, షాలిని ప్రధాన తారాగణం. అమీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో క్రాంతికుమార్‌ రూపొందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు ట్రైలర్‌ను విడుదలచేయగా, మరో అతిథిగా పాల్గొన్న శేకూరి ధర్మశాస్త్ర పీఠాధిపతి గుంతపల్లి శ్రీనివాసరావు టైటిల్‌ లోగోను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాత క్రాంతికుమార్‌ మాట్లాడుతూ, కొత్తదనానికి పట్టంకట్టే తెలుగుప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. చిత్ర నిర్మాణంలో తనకు సహాయ సహకారాలు అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పేరు పేరునా ఆయన కృతజ్ఞతలను తెలియజేశారు.ఈ చిత్రంలో ఓ పాత్రను పోషించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, ఈ చిత్రం వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యేందుకు తనవంతు సహాయ సహకారాలను అందిస్తానని అన్నారు. అనంతరం అతిథుల చేతులమీదుగా చిత్రబృందానికి జ్ఞాపికల ప్రదానం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com