విడుదలైన 'త్రివిక్రమన్' ట్రైలర్
- September 02, 2016
త్రివిక్రమపాండ్యన్ అనే రాజు మరణానికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవడానికి వెళ్లిన బృందం ఎదుర్కొన్న పరిస్థితులు, పరిణామాల సమాహారంగా సోషియా ఫాంటసీగా రూపొందిన చిత్రం 'త్రివిక్రమన్' . రవిబాబు, నాగబాబు, శ్రీ (ఈరోజుల్లో ఫేమ్), ధనరాజ్, ప్రవీణ్రెడ్డి, అమూల్యారెడ్డి, షాలిని ప్రధాన తారాగణం. అమీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో క్రాంతికుమార్ రూపొందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. అతిథిగా విచ్చేసిన పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు ట్రైలర్ను విడుదలచేయగా, మరో అతిథిగా పాల్గొన్న శేకూరి ధర్మశాస్త్ర పీఠాధిపతి గుంతపల్లి శ్రీనివాసరావు టైటిల్ లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాత క్రాంతికుమార్ మాట్లాడుతూ, కొత్తదనానికి పట్టంకట్టే తెలుగుప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. చిత్ర నిర్మాణంలో తనకు సహాయ సహకారాలు అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పేరు పేరునా ఆయన కృతజ్ఞతలను తెలియజేశారు.ఈ చిత్రంలో ఓ పాత్రను పోషించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, ఈ చిత్రం వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యేందుకు తనవంతు సహాయ సహకారాలను అందిస్తానని అన్నారు. అనంతరం అతిథుల చేతులమీదుగా చిత్రబృందానికి జ్ఞాపికల ప్రదానం జరిగింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







