మోహన్ బాబుకు పద్మశ్రీ యథాతథం

- August 03, 2015 , by Maagulf
మోహన్ బాబుకు పద్మశ్రీ యథాతథం

పద్మశ్రీ అవార్డును దుర్వినియోగం చేశారని సినీనటుడు మోహన్‌బాబుపై రేగిన వివాదం ఎట్టకేలకు ముగిసింది. పద్మశ్రీ అవార్డును దుర్వినియోగం చేయబోమంటూ గతంలో మోహన్‌బాబు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కనపెట్టింది. మోహన్‌బాబుకు పద్మశ్రీ యథాతథంగా కొనసాగుతుందని తాజాగా సుప్రీంకోర్టు ప్రకటించింది. మోహన్ బాబు నటించిన దేనికైనా రెడీ సినిమాలో పద్మశ్రీ అవార్డును సినిమా టైటిల్స్‌లో వేసుకున్నారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. నిర్మాత తన ప్రమేయం లేకుండానే టైటిల్స్‌లో పద్మశ్రీని ఉపయోగించారని ఆయన వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు సుప్రీం తీర్పుతో కొంత ఊరట లభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com