ఫైనల్స్లోకి ఇండియా, పాకిస్తాన్ విద్యార్థులు
- September 05, 2016
సెప్టెంబర్ 19 ఉంచి 22 వరకు పారిస్లో జరిగే యాన్యువల్ గ్లోబల్ 'గో గ్రీన్ ఇన్ ది సిటీ' కార్యక్రమం కోసం 12 మందిలో పోటీ పడేందుకు మస్దార్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపకియ్యారు. భారత జాతీయుడైన హిబా రియాజ్, పాకిస్తాన్కి చెందిన అర్సలన్ అంజుమ్ 'సోలార్ వే' ప్రాజెక్ట్తో 1183 టీమ్స్తో పోటీ పడి ముందడుగు వేశారు. క్లీన్ ఎనర్జీలో భాగంగా వీరు చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. 12 కిలోమీటర్ల సోలార్ వే 2.5 మిలియన్ కిలో వాట్స్ / అవర్ పవర్ని జనరేట్ చేస్తుందని అంజుమన్ మరియు రియాజ్ వెల్లడించారు. వీరిద్దరూ మైక్రోసిస్టమ్స్ ఇంజనీరింగ్ని మస్దార్ ఇన్స్టిట్యూట్లో అభ్యసిస్తున్నారు. సెప్టెంబర్లో విజేతల్ని ప్రకటిస్తారు. ఎనర్జీ లీడర్ ద్వారా విజేతలకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 100 మంది సెమీ ఫైనలిస్ట్స్ నుంచి 12 మంది సెలక్ట్ కావడం అంటే చిన్న విషయం కాదని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగే ఫైనల్లో బిజినెస్ వర్క్ షాప్స్, నెట్వర్కింగ్ ఈవెంట్స్, సిటీ టూర్స్ మరియు మెయిన్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి. ఈ ఏడాది మొత్తం 16,400 రిజిస్ట్రేషన్స్ నమోదయ్యాయి. 2015లో వీటి సంఖ్య 12,800.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







