ఫైనల్స్లోకి ఇండియా, పాకిస్తాన్ విద్యార్థులు
- September 05, 2016
సెప్టెంబర్ 19 ఉంచి 22 వరకు పారిస్లో జరిగే యాన్యువల్ గ్లోబల్ 'గో గ్రీన్ ఇన్ ది సిటీ' కార్యక్రమం కోసం 12 మందిలో పోటీ పడేందుకు మస్దార్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపకియ్యారు. భారత జాతీయుడైన హిబా రియాజ్, పాకిస్తాన్కి చెందిన అర్సలన్ అంజుమ్ 'సోలార్ వే' ప్రాజెక్ట్తో 1183 టీమ్స్తో పోటీ పడి ముందడుగు వేశారు. క్లీన్ ఎనర్జీలో భాగంగా వీరు చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. 12 కిలోమీటర్ల సోలార్ వే 2.5 మిలియన్ కిలో వాట్స్ / అవర్ పవర్ని జనరేట్ చేస్తుందని అంజుమన్ మరియు రియాజ్ వెల్లడించారు. వీరిద్దరూ మైక్రోసిస్టమ్స్ ఇంజనీరింగ్ని మస్దార్ ఇన్స్టిట్యూట్లో అభ్యసిస్తున్నారు. సెప్టెంబర్లో విజేతల్ని ప్రకటిస్తారు. ఎనర్జీ లీడర్ ద్వారా విజేతలకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 100 మంది సెమీ ఫైనలిస్ట్స్ నుంచి 12 మంది సెలక్ట్ కావడం అంటే చిన్న విషయం కాదని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగే ఫైనల్లో బిజినెస్ వర్క్ షాప్స్, నెట్వర్కింగ్ ఈవెంట్స్, సిటీ టూర్స్ మరియు మెయిన్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి. ఈ ఏడాది మొత్తం 16,400 రిజిస్ట్రేషన్స్ నమోదయ్యాయి. 2015లో వీటి సంఖ్య 12,800.
తాజా వార్తలు
- కొత్తగా ప్రపోజ్ చేస్తానని పిలిచి.. బెంగుళూరులో ఘోరం
- టాలీవుడ్లో విషాదం..చిట్టిబాబు కన్నుమూత
- వైభవంగా కేదార్నాథ్ ఆలయ పునఃప్రారంభం..
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!









