యాదాద్రిని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం: కేసీఆర్

- September 05, 2016 , by Maagulf
యాదాద్రిని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం: కేసీఆర్

యాదాద్రి అభివృద్ధిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. యాదాద్రిని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నామని కేసీఆర్ అన్నారు. రాబోయే కాలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని సీఎం తెలిపారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. యాదాద్రికి అభిముఖంగా గుట్టలతో కూడిన ప్రాంతాన్ని టెంపుల్‌ సిటీగా తీర్చిదిద్దాలని నిర్ణయినట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. 850 ఎకరాల విస్తీర్ణంలో టెంపుల్‌ సిటీ నిర్మాణాన్ని చేపడతామని సీఎం కేసీఆర్‌ అన్నారు. మొదటిదశలో 250 ఎకరాల్లో చేపట్టాల్సిన పనులపై డిజైన్లు ఖరారు చేసినట్లు కేసీఆర్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com