రెండు రోడ్డు ప్రమాదాల్లో 20 మందికి గాయాలు
- September 05, 2016
దుబాయ్: రెండు రోడ్డు ప్రమాదాల్లో 20 మంది గాయపడగా, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. శని, ఆదివారాల్లో ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంక్రీట్ మిక్సర్ ప్రమాదంలో దగ్ధమయ్యింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది గాయపడ్డారని దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. సెర్బియన్ వ్యక్తి తాను నడుపుతున్న కారుతో, ఇండియన్ వ్యక్తి నడుపుతున్న వాహనాన్ని డీకొన్నాడనీ, క్షణాల్లోనే ఓ బస్సు ఈ వాహనాల్ని ఢీకొందని ఆయన వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం 14 మంది గాయపడ్డారు. ఆదివారమే జరిగిన ఇంకో ఘటనలో ఓ వాహనం, మెటల్ బారియర్ని ఢీకొన్న ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. దుబాయ్ అల్ అయిన్ రోడ్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







