యూఎస్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ నుంచి నిష్క్రమించిన బోపన్న జోడీ
- September 05, 2016
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత క్రీడాకారులు మిశ్రమ ఫలితాలు కనబరిచారు. మహిళల డబుల్స్లో సానియా మీర్జా జోడీ క్వార్టర్స్కు దూసుకెళ్లగా.. మిక్స్డ్ డబుల్స్ నుంచి బోపన్న జోడీ నిష్క్రమించింది.
ప్రీక్వార్టర్స్లో అమెరికా, జపనీస్ జోడీ నికోలే గిబ్స్- నావో హిబినోపై సానియా-స్ట్రైకోవా ద్వయం 6-4, 7-5 వరుస సెట్లతో గెలుపొందింది. దీంతో మహిళల డబుల్స్లో సానియా జోడీ క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. క్వార్టర్స్లో ఫ్రెంచ్ టాప్ సీడ్స్ కరోలిన్ గార్షియా-క్రిస్టినాతో సానియా జోడీ తలపడనుంది. .
ఇక మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్లో ఓటమిపాలైన బోపన్న జోడీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
క్వార్టర్స్లో రాబర్ట్ ఫరా(కెనడా), అన్నా లెనా(జర్మనీ) జోడీ చేతిలో బోపన్న-డబ్రోవ్స్కీ ద్వయం 6-1, 2-6, 8-10 సెట్లతో హోరాహోరీగా పోరాడి ఓడిపోయింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







