యూఎస్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ నుంచి నిష్క్రమించిన బోపన్న జోడీ
- September 05, 2016
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత క్రీడాకారులు మిశ్రమ ఫలితాలు కనబరిచారు. మహిళల డబుల్స్లో సానియా మీర్జా జోడీ క్వార్టర్స్కు దూసుకెళ్లగా.. మిక్స్డ్ డబుల్స్ నుంచి బోపన్న జోడీ నిష్క్రమించింది.
ప్రీక్వార్టర్స్లో అమెరికా, జపనీస్ జోడీ నికోలే గిబ్స్- నావో హిబినోపై సానియా-స్ట్రైకోవా ద్వయం 6-4, 7-5 వరుస సెట్లతో గెలుపొందింది. దీంతో మహిళల డబుల్స్లో సానియా జోడీ క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. క్వార్టర్స్లో ఫ్రెంచ్ టాప్ సీడ్స్ కరోలిన్ గార్షియా-క్రిస్టినాతో సానియా జోడీ తలపడనుంది. .
ఇక మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్లో ఓటమిపాలైన బోపన్న జోడీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
క్వార్టర్స్లో రాబర్ట్ ఫరా(కెనడా), అన్నా లెనా(జర్మనీ) జోడీ చేతిలో బోపన్న-డబ్రోవ్స్కీ ద్వయం 6-1, 2-6, 8-10 సెట్లతో హోరాహోరీగా పోరాడి ఓడిపోయింది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









