యూఎస్‌ ఓపెన్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ నుంచి నిష్క్రమించిన బోపన్న జోడీ

- September 05, 2016 , by Maagulf
యూఎస్‌ ఓపెన్‌లో  మిక్స్‌డ్‌ డబుల్స్‌ నుంచి నిష్క్రమించిన బోపన్న జోడీ

యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత క్రీడాకారులు మిశ్రమ ఫలితాలు కనబరిచారు. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా జోడీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌ నుంచి బోపన్న జోడీ నిష్క్రమించింది.
ప్రీక్వార్టర్స్‌లో అమెరికా, జపనీస్‌ జోడీ నికోలే గిబ్స్‌- నావో హిబినోపై సానియా-స్ట్రైకోవా ద్వయం 6-4, 7-5 వరుస సెట్లతో గెలుపొందింది. దీంతో మహిళల డబుల్స్‌లో సానియా జోడీ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో ఫ్రెంచ్‌ టాప్‌ సీడ్స్‌ కరోలిన్‌ గార్షియా-క్రిస్టినాతో సానియా జోడీ తలపడనుంది. .
ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్స్‌లో ఓటమిపాలైన బోపన్న జోడీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

క్వార్టర్స్‌లో రాబర్ట్‌ ఫరా(కెనడా), అన్నా లెనా(జర్మనీ) జోడీ చేతిలో బోపన్న-డబ్రోవ్‌స్కీ ద్వయం 6-1, 2-6, 8-10 సెట్లతో హోరాహోరీగా పోరాడి ఓడిపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com