భారీ అగ్నిప్రమాదం: 100 మందికి తప్పిన ప్రాణగండం
- September 06, 2016
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమాలోని గసిదత్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 100 మందికి పైగా కార్మికులు బస చేసిన ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించడంతో తీవ్ర భయాందోళనల నెలకొన్నాయి. అయితే సమాచారం అందుకున్న వెంటనే రస్ అల్ ఖైమా పోలీసులు అలర్ట్ అయ్యారు. రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించింది. రికార్డు సమయంలో ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందుగా ప్రాణ నష్టం తగ్గించే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మొత్తం అక్కడున్న 100 మంది కార్మికుల్నీ రక్షించగలిగారు. ఆ తర్వాత నీరు, ఫోమ్ ఉపయోగించి మంటల్ని అదుపుచేయగలిగారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా మంటల్ని అదుపు చేయడం పట్ల ఫైర్ ఫైటర్స్కి కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. నిద్రలో ఉండగా అగ్ని ప్రమాదం సంభవించిందని భారీయెత్తున ఎగసిపడ్డ మంటల్లోంచి తాము ప్రాణాలతో బయటపడ్తామని అనుకోలేదని పాకిస్తాన్కి చెందిన కార్మికుడొకరు చెప్పారు. మంటల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, సుదూర ప్రాంతాల నుంచి కూడా పొగ, మంటలు కనిపించాయి.
తాజా వార్తలు
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..









