భారీ అగ్నిప్రమాదం: 100 మందికి తప్పిన ప్రాణగండం
- September 06, 2016
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమాలోని గసిదత్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 100 మందికి పైగా కార్మికులు బస చేసిన ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించడంతో తీవ్ర భయాందోళనల నెలకొన్నాయి. అయితే సమాచారం అందుకున్న వెంటనే రస్ అల్ ఖైమా పోలీసులు అలర్ట్ అయ్యారు. రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించింది. రికార్డు సమయంలో ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందుగా ప్రాణ నష్టం తగ్గించే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మొత్తం అక్కడున్న 100 మంది కార్మికుల్నీ రక్షించగలిగారు. ఆ తర్వాత నీరు, ఫోమ్ ఉపయోగించి మంటల్ని అదుపుచేయగలిగారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా మంటల్ని అదుపు చేయడం పట్ల ఫైర్ ఫైటర్స్కి కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. నిద్రలో ఉండగా అగ్ని ప్రమాదం సంభవించిందని భారీయెత్తున ఎగసిపడ్డ మంటల్లోంచి తాము ప్రాణాలతో బయటపడ్తామని అనుకోలేదని పాకిస్తాన్కి చెందిన కార్మికుడొకరు చెప్పారు. మంటల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, సుదూర ప్రాంతాల నుంచి కూడా పొగ, మంటలు కనిపించాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







