ఎమిర్‌ షేక్‌కి భారత ప్రధాని నరేంద్రమోడీ సందేశం

- September 06, 2016 , by Maagulf
ఎమిర్‌ షేక్‌కి భారత ప్రధాని నరేంద్రమోడీ సందేశం

దోహా ఎమిర్‌ షేక్‌ తమిమ్‌ బిన్‌ హమాద్‌ అల్‌ థని, భారత ప్రధాని నరేంద్రమోడీ నుంచి లిఖిత పూర్వక సందేశం అందుకున్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఇంకా గొప్పగా కొనసాగాలని ఈ లేఖలో నరేంద్రమోడీ ఆకాంక్షించారు. సంబంధాల బలోపేతం కోసం ఇరువురం కలిసి పనిచేద్దామని పేర్కొన్నారు నరేంద్రమోడీ. దోహాలో పర్యటిస్తున్న భారత కేంద్ర సహాయ మంత్రి (విదేశీ వ్యవహారాలు) వికె సింగ్‌, విదేశాంగ శాఖ మంత్రి షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌రహమాన్‌ అల్‌ థనికి ఈ లేఖను అందించారు. ఆయన ఆ లేఖను, ఎమిర్‌ షేక్‌కి అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com