చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక

- April 21, 2026 , by Maagulf
చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక

అమెరికా: అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాల మధ్య కుదిరిన రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగియనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు కఠిన హెచ్చరిక జారీ చేశారు.

చర్చలు విఫలమైతే దాడులు
నిర్ణీత గడువులోగా చర్చల్లో పురోగతి లేకపోతే పరిస్థితి తీవ్రమవుతుందని ట్రంప్ తెలిపారు. ఒకవేళ ఇరాన్ చర్చలకు హాజరుకాకపోతే భారీ బాంబు దాడులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది.

అమెరికా హెచ్చరికలపై ఇరాన్ కూడా ఘాటుగా స్పందించింది. అమెరికా చేస్తున్న డిమాండ్లు అసంబద్ధమని పేర్కొంది. తమపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నదని ఆరోపించింది. బలప్రయోగానికి తలవంచేది లేదని ఇరాన్ నాయకత్వం స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com