రాష్ట్రం నలుమూలలకు ఐటీ శాఖ..
- September 07, 2016
తెలంగాణాలో ఐటీ అంటే హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఒక్కటే కాదని రాష్ట్రం నలుమూలలకు ఈరంగం విస్తరించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని బలంగా నమ్మిన మంత్రి కేటీఆర్. ఆ దిశగా చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఐటీ శాఖ పరిధిలో ప్రత్యేకంగా తీసుకువచ్చిన రూరల్ టెక్ పాలసీ ద్వారా ఇప్పటికే మూడు జిల్లాల్లో నాలుగు ప్రఖ్యాత కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. మరిన్ని జిల్లాల్లో కంపెనీలు స్థాపించేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పల్లె ప్రాంతాలకు సాంకేతిక కొలువులు తీసుకువెళ్ళాలన్నది కేటీఆర్ లక్ష్యం. దీనికి సంబంధించి ప్రత్యేక ఉపపాలసీని కూడా ప్రకటించారు. ఇన్ఫోటెక్ వరంగల్లో ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా 1800 మందికి ఉపాధి కల్పించనుంది. అలాగే కరీంనగర్ జిల్లాలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, హుజూరాబాద్ లో తెలెకా నెట్ వర్కింగ్ టెక్నాలజీస్ ను మంత్రి కేటీఆర్ ఇటీవలే ప్రారంభించారు. ఈ పరిశ్రమల ద్వారా 260 మందికి ఉపాధి దక్కనుంది. మరోవైపు నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన శాండ్ బాక్స్ మరింద వినూత్నంగా పనిచేస్తున్నది. ఇక మరికొంత మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇక హైదరాబాదు వచ్చి ఉద్యోగాలు వెతుక్కోవలసిన అవసరం ఇంజనీరింగ్ విద్యార్థులకు తప్పినట్లే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







