రాష్ట్రం నలుమూలలకు ఐటీ శాఖ..
- September 07, 2016
తెలంగాణాలో ఐటీ అంటే హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఒక్కటే కాదని రాష్ట్రం నలుమూలలకు ఈరంగం విస్తరించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని బలంగా నమ్మిన మంత్రి కేటీఆర్. ఆ దిశగా చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఐటీ శాఖ పరిధిలో ప్రత్యేకంగా తీసుకువచ్చిన రూరల్ టెక్ పాలసీ ద్వారా ఇప్పటికే మూడు జిల్లాల్లో నాలుగు ప్రఖ్యాత కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. మరిన్ని జిల్లాల్లో కంపెనీలు స్థాపించేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పల్లె ప్రాంతాలకు సాంకేతిక కొలువులు తీసుకువెళ్ళాలన్నది కేటీఆర్ లక్ష్యం. దీనికి సంబంధించి ప్రత్యేక ఉపపాలసీని కూడా ప్రకటించారు. ఇన్ఫోటెక్ వరంగల్లో ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా 1800 మందికి ఉపాధి కల్పించనుంది. అలాగే కరీంనగర్ జిల్లాలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, హుజూరాబాద్ లో తెలెకా నెట్ వర్కింగ్ టెక్నాలజీస్ ను మంత్రి కేటీఆర్ ఇటీవలే ప్రారంభించారు. ఈ పరిశ్రమల ద్వారా 260 మందికి ఉపాధి దక్కనుంది. మరోవైపు నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన శాండ్ బాక్స్ మరింద వినూత్నంగా పనిచేస్తున్నది. ఇక మరికొంత మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇక హైదరాబాదు వచ్చి ఉద్యోగాలు వెతుక్కోవలసిన అవసరం ఇంజనీరింగ్ విద్యార్థులకు తప్పినట్లే.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









