ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ఆవిష్కరించిన ఆపిల్ సంస్థ..
- September 07, 2016
ప్రపంచవ్యాప్తంగా హైప్ క్రియేట్ అయిన ఐఫోన్ సెవెన్, 7 ప్లస్ మొబైల్ మోడల్స్ ను ఆపిల్ సంస్థ ఆవిష్కరించింది. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఇతర ప్రముఖులు ఈ లేటెస్ట్ మొబైల్స్ ను ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో సెకండ్ జనరేషన్ స్మార్ట్ వాచ్ను కూడా విడుదల చేశారు. 32 జీబీ వెర్షన్ ఉన్న ఐఫోన్ 7 ప్రారంభ ధర 649 డాలర్లు ఉండగా.. ఐఫోన్ 7 ప్లస్ రేటు 769 డాలర్లుగా కంపెనీ ప్రకటించింది. 128, 256 జీబీ వెర్షన్లలోనూ ఈ మొబైల్ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఐఫోన్ సెవెన్ కు 4.7 అంగుళాల రెటీనా హెచ్డీ డిస్ప్లే స్క్రీన్ ఉండగా.. వెనుక భాగంలో 12 మెగా పిక్సల్స్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వంటి సదుపాయాలు ఉన్నాయి. అదే ఐఫోన్ 7 ప్లస్ లో 5.5 అంగుళాల రెటీనా హెచ్డీ డిస్ప్లే స్క్రీన్ సహా... ఇంత వరకూ ఏ ఫోన్లోనూ లేని విధంగా యాపిల్ ఐఫోన్ 7 ప్లస్కు కెమెరా పరంగా సరికొత్త హంగులు అద్దింది. సెల్ఫీ ప్రియుల కోసం ముందు భాగంలో 7 మెగా పిక్సల్ ఫేస్ టైమ్ హెచ్డీ కెమెరా సైతం ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







