ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ఆవిష్కరించిన ఆపిల్ సంస్థ..

- September 07, 2016 , by Maagulf
ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ఆవిష్కరించిన ఆపిల్ సంస్థ..

ప్రపంచవ్యాప్తంగా హైప్ క్రియేట్ అయిన ఐఫోన్ సెవెన్, 7 ప్లస్ మొబైల్ మోడల్స్ ను ఆపిల్ సంస్థ ఆవిష్కరించింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఇతర ప్రముఖులు ఈ లేటెస్ట్ మొబైల్స్ ను ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో సెకండ్ జనరేషన్ స్మార్ట్ వాచ్‌ను కూడా విడుదల చేశారు. 32 జీబీ వెర్షన్ ఉన్న ఐఫోన్ 7 ప్రారంభ ధర 649 డాలర్లు ఉండగా.. ఐఫోన్ 7 ప్లస్ రేటు 769 డాలర్లుగా కంపెనీ ప్రకటించింది. 128, 256 జీబీ వెర్షన్లలోనూ ఈ మొబైల్ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఐఫోన్ సెవెన్ కు 4.7 అంగుళాల రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లే స్క్రీన్ ఉండగా.. వెనుక భాగంలో 12 మెగా పిక్సల్స్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వంటి సదుపాయాలు ఉన్నాయి. అదే ఐఫోన్ 7 ప్లస్ లో 5.5 అంగుళాల రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లే స్క్రీన్ సహా... ఇంత వరకూ ఏ ఫోన్‌లోనూ లేని విధంగా యాపిల్ ఐఫోన్ 7 ప్లస్‌కు కెమెరా పరంగా సరికొత్త హంగులు అద్దింది. సెల్ఫీ ప్రియుల కోసం ముందు భాగంలో 7 మెగా పిక్సల్ ఫేస్‌ టైమ్ హెచ్‌డీ కెమెరా సైతం ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com