మనసు లో మాట చెప్పిన ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామరెడ్డి
- August 04, 2015
ఇప్పటి వరకు తాను 93 సినిమాలకు దర్శకత్వం వహించగా వాటిలో 27 మెగాస్టార్ చిరంజీవి న టించినవేనని, తన వం దో సినిమా కూడా ఆయనతోనే చేయాలని ఉందని ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామరెడ్డి అ న్నారు. కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వంలో కోదండ రామరెడ్డి తనయుడు వైభవ్ హీరోగా నటించిన 'పాండవుల్లో ఒకడు' సినిమా యూనిట్ సో మవారం అనుశ్రీ సారుుకృష్ణా థియేటర్లో సందడి చేసింది. తం డ్రీ తనయులు మ్యాట్నీషో విరామంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కోదండరామరెడ్డి మాట్లాడుతూ చిరంజీవితో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు ఆనందంగా ఉందన్నారు. 93 సినిమాలు చేసిన తాను మిగతా ఏడూ పూర్తిచేసి, శతచిత్రదర్శకుడిని అనిపించుకుంటానన్నారు. చిరంజీవి అంగీకారం కోసం ప్రయత్నిస్తానన్నారు. వైభవ్కు ఎక్కువగా తమిళ సినిమారంగంనుం చి ఆఫర్లు వస్తున్నాయన్నారు. పరిశ్రమలో ప్రతివారూ తమ పిల్లలు స్థి రపడేలా చేయూలనుకుంటున్నప్పుడు తన కొడుకు పైకి రావాలని తా ను ప్రయత్నించడం తప్పు కాదన్నారు. వైభవ్ మాట్లాడుతూ సి నిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో మరిన్ని మంచి సినిమాల్లో నటిస్తానన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







