'కింగ్' నాగార్జున స్థానంలో మెగాస్టార్ ..
- September 09, 2016
దాదాపు పదేళ్లపాటు వెండితెరకు దూరమై ఇప్పుడు మళ్లీ ముఖానికి రంగేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. వినాయక్ దర్శకత్వంలో 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఆ తర్వాత కూడా సినిమాలు కొనసాగిస్తానని మెగాస్టార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేయడానికి మెగాస్టార్ బుల్లితెరపై కూడా సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తిచేసుకున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రామ్ను ఇకపై చిరు నడిపించనున్నారట. అంటే 'కింగ్' నాగార్జున స్థానంలో మెగాస్టార్ కనబడనున్నారన్నమాట.ఈ కార్యక్రమం డిసెంబర్లో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాదిన ఘనవిజయం సాధించిన అమితాబ్ 'కౌన్ బనేగా కరోడ్పతి' కార్యక్రమానికి తెలుగు వెర్షనే 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. అంటే అమితాబ్ను ఆదర్శంగా తీసుకుని చిరంజీవి కూడా క్విజ్ మాస్టర్ అవతారం ఎత్తనున్నారన్నమాట.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







