సగ్గుబియ్యం రైతా
- August 05, 2015
సగ్గుబియ్యం రైతా
కావలిసిన పదార్ధాలు
సగ్గుబియ్యం - 2 కప్పులు
వేయించిన వేరుశెనగపప్పు - అరకప్పు
తాజా పెరుగు - కప్పు
పచ్చిమిర్చి - నాలుగు
కొత్తిమీర - కొద్దిగా
జీలకర్ర - 2 టీ స్పూన్లు
ఇంగువ - చిటికెడు
ఉప్పు - తగినంత
తయారీ విధానం
సగ్గుబియ్యాన్ని ముందు రోజు నానబెట్టి, మరుసటి రోజు ఉడికించి వడపోయాలి. వడిపోసిన సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో వేయించిన వేరు శెనగపప్పు, పెరుగు, కొత్తిమీర, ఇంగువా, ఉప్పు వేసి ఉండలు లేకుండా మృదువుగా అయ్యేలా కలపాలి. ఇప్పుడు బాణలిలో జీలకర్ర, కొద్దిగా ఇంగువా, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి, సగ్గుబియ్యం మిశ్రమంలో కలపి అరగంట సేపు మూత పెట్టేయాలి. అంతే సగ్గుబియ్యం రైతా రెడీ. ఇది స్నాక్ ఐటంలా తినొచ్చు. ఇష్టం ఉన్నవాళ్లు రోటీతో తినొచ్చు. లేదా బిరియానీతో కూడా తినొచ్చు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







