సగ్గుబియ్యం రైతా
- August 05, 2015
సగ్గుబియ్యం రైతా
కావలిసిన పదార్ధాలు
సగ్గుబియ్యం - 2 కప్పులు
వేయించిన వేరుశెనగపప్పు - అరకప్పు
తాజా పెరుగు - కప్పు
పచ్చిమిర్చి - నాలుగు
కొత్తిమీర - కొద్దిగా
జీలకర్ర - 2 టీ స్పూన్లు
ఇంగువ - చిటికెడు
ఉప్పు - తగినంత
తయారీ విధానం
సగ్గుబియ్యాన్ని ముందు రోజు నానబెట్టి, మరుసటి రోజు ఉడికించి వడపోయాలి. వడిపోసిన సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో వేయించిన వేరు శెనగపప్పు, పెరుగు, కొత్తిమీర, ఇంగువా, ఉప్పు వేసి ఉండలు లేకుండా మృదువుగా అయ్యేలా కలపాలి. ఇప్పుడు బాణలిలో జీలకర్ర, కొద్దిగా ఇంగువా, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి, సగ్గుబియ్యం మిశ్రమంలో కలపి అరగంట సేపు మూత పెట్టేయాలి. అంతే సగ్గుబియ్యం రైతా రెడీ. ఇది స్నాక్ ఐటంలా తినొచ్చు. ఇష్టం ఉన్నవాళ్లు రోటీతో తినొచ్చు. లేదా బిరియానీతో కూడా తినొచ్చు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







