సగ్గుబియ్యం రైతా
- August 05, 2015
సగ్గుబియ్యం రైతా
కావలిసిన పదార్ధాలు
సగ్గుబియ్యం - 2 కప్పులు
వేయించిన వేరుశెనగపప్పు - అరకప్పు
తాజా పెరుగు - కప్పు
పచ్చిమిర్చి - నాలుగు
కొత్తిమీర - కొద్దిగా
జీలకర్ర - 2 టీ స్పూన్లు
ఇంగువ - చిటికెడు
ఉప్పు - తగినంత
తయారీ విధానం
సగ్గుబియ్యాన్ని ముందు రోజు నానబెట్టి, మరుసటి రోజు ఉడికించి వడపోయాలి. వడిపోసిన సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో వేయించిన వేరు శెనగపప్పు, పెరుగు, కొత్తిమీర, ఇంగువా, ఉప్పు వేసి ఉండలు లేకుండా మృదువుగా అయ్యేలా కలపాలి. ఇప్పుడు బాణలిలో జీలకర్ర, కొద్దిగా ఇంగువా, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి, సగ్గుబియ్యం మిశ్రమంలో కలపి అరగంట సేపు మూత పెట్టేయాలి. అంతే సగ్గుబియ్యం రైతా రెడీ. ఇది స్నాక్ ఐటంలా తినొచ్చు. ఇష్టం ఉన్నవాళ్లు రోటీతో తినొచ్చు. లేదా బిరియానీతో కూడా తినొచ్చు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









