దుబాయ్ లో తెలుగు సినీ తారల సందడి
- August 06, 2015
తెలుగు సినీ తారలు దుబాయ్ లో 'సైమా'(సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) కి విచ్చేసారు.దక్షిణాది తారలంతా ఒకే వేదిక మీద చేసుకునే సందడి ఇది. ఆట పాటలతో ఇక్కడి దక్షిణాది ప్రజలను అలరించనున్నారు.'దుబాయ్ వరల్డ్ సెంటర్' లో నాలుగో సారి ఈ అవార్డ్ల పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిరవహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.గురువారము తెలుగు మరియు కన్నడ అవార్డ్ల ప్రదానోత్సవం జరుగుతుంది. శుఖ్రవారము తమిళం మరియు మలయాళం అవార్డ్ల ప్రదానోత్సవం జరుగుతుంది.ఈ కార్యక్రమములో తెలుగు,కన్నడ,తమిళ,మలయాళం సినీ పరిశ్రమలకు చెందినా తారలు పాల్గొంటారు.ప్రముఖ కధానాయకుడు రానా సైమా వేడుకకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు.దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాణీలతో అందరిని అలరించనున్నారు.శ్రుతి హస్సన్,శ్రియ తాపసి,ఆదాశర్మ,పూజ హెగ్డే,షర్మిలా వీళ్ళంతా ఆటపాటలతో అందరిని అలరించునున్నారు. తెలుగువారి లో ఇప్పటికే బాలకృష్ణ,నాగ చైతన్య,అల్లు అర్జున్,రవి పనస(ఆర్.కె మీడియా అధినేత) విచ్చేసి ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమ లో మీడియాయందు తమకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్న 'ఆర్.కె మీడియా' వారు గత నాలుగు సంవత్సరాలుగా సైమాకు మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







