దుబాయ్ లో తెలుగు సినీ తారల సందడి
- August 06, 2015
తెలుగు సినీ తారలు దుబాయ్ లో 'సైమా'(సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) కి విచ్చేసారు.దక్షిణాది తారలంతా ఒకే వేదిక మీద చేసుకునే సందడి ఇది. ఆట పాటలతో ఇక్కడి దక్షిణాది ప్రజలను అలరించనున్నారు.'దుబాయ్ వరల్డ్ సెంటర్' లో నాలుగో సారి ఈ అవార్డ్ల పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిరవహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.గురువారము తెలుగు మరియు కన్నడ అవార్డ్ల ప్రదానోత్సవం జరుగుతుంది. శుఖ్రవారము తమిళం మరియు మలయాళం అవార్డ్ల ప్రదానోత్సవం జరుగుతుంది.ఈ కార్యక్రమములో తెలుగు,కన్నడ,తమిళ,మలయాళం సినీ పరిశ్రమలకు చెందినా తారలు పాల్గొంటారు.ప్రముఖ కధానాయకుడు రానా సైమా వేడుకకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు.దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాణీలతో అందరిని అలరించనున్నారు.శ్రుతి హస్సన్,శ్రియ తాపసి,ఆదాశర్మ,పూజ హెగ్డే,షర్మిలా వీళ్ళంతా ఆటపాటలతో అందరిని అలరించునున్నారు. తెలుగువారి లో ఇప్పటికే బాలకృష్ణ,నాగ చైతన్య,అల్లు అర్జున్,రవి పనస(ఆర్.కె మీడియా అధినేత) విచ్చేసి ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమ లో మీడియాయందు తమకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్న 'ఆర్.కె మీడియా' వారు గత నాలుగు సంవత్సరాలుగా సైమాకు మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







