బట్టబయలైన దొంగతనం
- August 06, 2015
ఒక ఊరిలో గంగయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా మంచి వాడు. అతని దగ్గర ఒక ఆవు ఉండేది. ఆ ఆవును చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఎంతో శ్రద్దగా దానికి మేత, కుడితి పెడుతూ ఉండేవాడు. అంతే కాకుండా దాన్ని దైవంగా భావించి ప్రతి శుక్రవారం శుభ్రంగా స్నానం చేయించి, పసుపు, కుంకుమలతో పూజలు కూడా చేసేవాడు. కొన్నాళ్లకు ఆ ఆవు ఒక దూడను కన్నది. ఆ ఆవును,దూడను కూడా ఎంతో బాగా చూసుకునేవాడు. దాంతో అతనికి పాల దిగుబడి పెరిగి, ఆదాయం కూడా బాగా పెరిగింది. ఇలా ఉండగా ఒకరోజు ఆ ఆవును ఎవరో దొంగిలించుకుపోయారు. దాంతో గంగయ్య చాలా బాధపడ్డాడు. దూడ కూడా బెంగపడి ఏమీ తినేది కాదు. దాంతో గంగయ్య ఒక ఉపాయం ఆలోచించి, తన ఆవును తెచ్చి ఇచ్చిన వారికి దూడను కూడా బహుమతిగా ఇస్తానని దండోరా వేయించాడు. దూడ కోసం ఆశపడిన ఆ ఊరి కిరాణా షాపు యజమాని గోపయ్య, తన దొడ్లో కట్టి పారేసిన ఆవును తీసుకొచ్చి గంగయ్య ముందు పెట్టి ఎంతో కష్టపడి నీ ఆవును వెతికి తీసుకొచ్చాను. నువ్వు చెప్పినట్లే నీ దూడను కూడా ఇచ్చి పంపించు అన్నాడు. అంతలో తన దూడను, యజమానిని గుర్తు పట్టిన ఆవు తన కాలితో గోపయ్య ఒక్క తన్ను తన్ని గంగయ్య దగ్గరికి వచ్చేసింది. గంగయ్య కిటుకు తెల్సుకోకుండా అమాయకంగా వచ్చి తన తప్పు తానే బయట పెట్టుకున్న గోపయ్య, గంగయ్యను క్షమించమని అడిగి అక్కడి నుండి వెళ్లిపోయాడు. గంగయ్య తన ఆవు దొరికినందుకు సంతోషించి, గోపయ్యను ఏమీ అనకుండా వదిలిపెట్టాడు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







