డ్రగ్స్ మాఫియా: 13మంది ఆమాయకులు అరెస్ట్ ..
- September 13, 2016
ఉత్తర తెలంగాణలో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. ఏకంగా సౌదీ దేశాలకు అక్రమంగా నిషేదిత మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో డ్రగ్స్ కి ఫుల్ డిమాండ్ ఉండటంతో కొందరు ఏజెంట్లు స్మగ్లర్ల అవతారమెత్తుతున్నారు. ఉపాధి కోసం గల్ఫ్ కి వెళ్తున్న అమాయకులను బలిపశువులను చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్,కరీంనగర్,ఆదిలాబాద్ జిల్లాల్లో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోంది. గల్ఫ్ ఏజెంట్లు స్మగ్లర్ల అవతారమెత్తి అమాయకులతో నిషేదిత మత్తుపదార్థాలు, ఔషధాలను అక్రమంగా గల్ఫ్ దేశాలకు సరఫరా చేస్తున్నారు. సౌదీ దేశాలకు వెళ్లొచ్చేవాళ్ల వివరాలు సేకరించి వారితో మందులు ప్యాక్ చేసిన కవర్ ను పంపిస్తారు. అక్కడ తమ వారు వచ్చి తీసుకుంటారని చెప్తారు. కవర్ తెచ్చిన వారికి 5నుంచి 10వేల వరకు డబ్బులు చెల్లిస్తారు. అయితే అందులో నిషేదిత మందులు ఉన్న విషయాన్ని తెలియని అమాయకులు పోలీసులకు చిక్కి కటకటాలపాలవుతున్నారు. ఇప్పటి వరకు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 13మంది ఆమాయకులు డ్రక్స్ మాఫియాకు బలయ్యారు.
రెండేళ్ల క్రితం కోరుట్ల మండలానికి చెందిన నరేష్..ఇలానే ఎయిర్ పోర్టులో పట్టుబడి జైలుపాలయ్యాడు. జగిత్యాల సమీపంలోని చిత్తం పేట్కు చెందిన మరో యువకుడు 20ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నాడు. తాజాగా నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తడ్పకల్కు చెందిన పూజారి శ్రీనివాస్ అనే యువకుడు డ్రగ్స్ మాఫియాలో చిక్కుకున్నాడు. గత ఆరేళ్లుగా దుబాయిలో ఉంటున్న శ్రీనివాస్ నాలుగు నెలల క్రితం స్వదేశం వచ్చాడు. పెళ్లి చేసుకొని ఈ నెల నాలుగున దుబాయి వెళ్లాడు. అయితే మోర్తాడ్ మండలం ఒడ్యాట్కు చెందిన మహేష్ ఆనే ట్రావెల్ ఏజేంట్..తమ బంధువులు అనారోగ్యంగా ఉన్నారని మందుల ప్యాకేట్ను శ్రీనివాస్ ద్వారా పంపించాడు. మందుల ప్యాకెట్ తీసుకెళ్లిన శ్రీనివాస్ ఎయిర్ పోర్టులో పట్టుబడ్డాడు. తన భర్తను జైలు పాలుచేసిన ఏజెంట్ మహేష్ను కఠినంగా శిక్షించాలని బాధితుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. డ్రగ్స్ రాకేట్లో 16మంది ఏజేంట్లు కీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రాథమికంగా పోలీసుల విచారణలో వెల్లడైనప్పటికి ఇప్పటి వరకు ఒక్క కేసుకూడా నమోదుకాలేదు. రాజకీయ ఒత్తిడుల కారణంగా ఆక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఏదిఏమైనా అక్రమ సంపాదనకు ఎగబడిన ఏజేంట్లు ఈ డ్రగ్స్ మాఫియాలో ఆమాయకులను పావులుగా వాడుకుంటున్నారు. ప్రభుత్వం లోతుగా విచారణ జరిపి డ్రగ్స్ స్మగ్లర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







