రోడ్డు ప్రమాదంలో తల్లి, చిన్నారి మృతి
- September 13, 2016
రస్ అల్ ఖైమా: మూడు నెలల చిన్నారి, ఆమె తల్లి ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. రెండు వాహనాలు సిగ్నల్ జంక్షన్ వద్ద ఒకదానితో ఒకటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెడ్ సిగ్నల్ని జంప్ చేసే క్రమంలో ఇంకో వాహనంతో ఢీ కొట్టి ప్రమాదానికి కారకుడయ్యారు మొదటి వాహనం నడుపుతున్న వ్యక్తి. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. మృతి చెందిన చిన్నారి వయసు కేవలం 3 నెలలు మాత్రమే. చిన్నారి తండ్రి రెడ్ సిగ్నల్ని జంప్ చేసేందుకు ప్రయత్నించడం ఈ ప్రమాదానికి కారణం. రస్ అల్ ఖైమా పోలీస్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెంట్రల్ ఆపరేషన్స్ జనరల్ డైరెక్టర్, బ్రిగేడియర్ డాక్టర్ మొహమ్మద్ సయీద్ అల్ హమిది మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలనీ, లేదంటే ఇటువంటి ప్రమాదాల బారిన పడతారని హెచ్చరించారు. సిగ్నల్ జంపింగ్ వంటి నిబంధనల ఉల్లంఘనకు భారీ జరీమానాలు, కఠిన శిక్షలు విధిస్తున్నా ప్రమాదాలు తగ్గకపోవడం, నిబంధనల ఉల్లంఘన ఆగకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!
- వివిధ ప్రదేశాలలో ఈదియా ATMలు ప్రారంభం..!!
- రాజద్రోహం కేసులో మరణశిక్షకు ప్రాసిక్యూషన్ పిలుపు..!!
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!









