రోడ్డు ప్రమాదంలో తల్లి, చిన్నారి మృతి
- September 13, 2016
రస్ అల్ ఖైమా: మూడు నెలల చిన్నారి, ఆమె తల్లి ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. రెండు వాహనాలు సిగ్నల్ జంక్షన్ వద్ద ఒకదానితో ఒకటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెడ్ సిగ్నల్ని జంప్ చేసే క్రమంలో ఇంకో వాహనంతో ఢీ కొట్టి ప్రమాదానికి కారకుడయ్యారు మొదటి వాహనం నడుపుతున్న వ్యక్తి. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. మృతి చెందిన చిన్నారి వయసు కేవలం 3 నెలలు మాత్రమే. చిన్నారి తండ్రి రెడ్ సిగ్నల్ని జంప్ చేసేందుకు ప్రయత్నించడం ఈ ప్రమాదానికి కారణం. రస్ అల్ ఖైమా పోలీస్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెంట్రల్ ఆపరేషన్స్ జనరల్ డైరెక్టర్, బ్రిగేడియర్ డాక్టర్ మొహమ్మద్ సయీద్ అల్ హమిది మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలనీ, లేదంటే ఇటువంటి ప్రమాదాల బారిన పడతారని హెచ్చరించారు. సిగ్నల్ జంపింగ్ వంటి నిబంధనల ఉల్లంఘనకు భారీ జరీమానాలు, కఠిన శిక్షలు విధిస్తున్నా ప్రమాదాలు తగ్గకపోవడం, నిబంధనల ఉల్లంఘన ఆగకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







