అఫ్ఘాన్ కు సాయం చేయనున్న భారత్
- September 14, 2016
అఫ్ఘనిస్థాన్ లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఒక బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. విద్య, వ్యవసాయం, నైపుణ్యాలను పెంచేందుకు ఆదేశానికి అన్ని విధాలా సాయం చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఇండియాలో రెండు రోజుల పాటు పర్యటిస్తున్న అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో సమావేశమయ్యారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్, అఫ్ఘనిస్థాన్ లు సంయుక్తంగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి. ఆసియాలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నవారికి వ్యతిరేకంగా కలిసి పనిచేయాలని తీర్మానించాయి. ఇరుదేశాలు ద్వైపాక్షిక సంబంధాలపై పలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.ఒక బిలియన్ డాలర్ల సాయంతో పాటు సోలార్ ఎనర్జీ, మెడిసిన్ లను సరసమైన ధరలకు అఫ్ఘాన్ కు అందించడానికి సహకరిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్టు విదేశాంగ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







