తెలుగు భాషాభివృద్ధి కమిటీ ఏర్పాటుకు ఏ.పి ప్రభుత్వం నిర్ణయం
- September 14, 2016
దశాబ్దాలుగా తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఏమి చేయడం లేదనే అపప్రద తెలుగు జనాల్లో బలంగా నాటుకుపోయింది. తాజాగా ఏపీలో ఈ తరహా పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో ఉన్నట్లుంది ఏపీ సర్కార్. తాజాగా టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయమే ఇందుకో ప్రత్యక్ష ఉదాహరణ.
తెలుగు భాషాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఈ మేరకు తెలుగులోనే ఉత్తర్వులను జారీ చేయడం విశేషం. ప్రభుత్వం నియమించిన ఈ కమిటీలో మండలి బుద్దప్రసాద్, పరకాల ప్రభాకర్, నాగులపల్లి శ్రీకాంత్, జీవీ రామకృష్ణారావు, విజయభాస్కర్ లు సభ్యులుగా ఉండనున్నారు.
ఇకనుంచి ఏపీలోని దుకాణాల పేర్లు కూడా తెలుగులోనే ఏర్పాటు చేయాలన్న నిబంధనను తాజా ఉత్తర్వుల ద్వారా ప్రకటించింది ప్రభుత్వం. శిలాఫలకాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పేర్లు తెలుగులోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







