నిమజ్జన కోలాహలంతో హుస్సేన్సాగర్..
- September 14, 2016
హుస్సేన్సాగర్ వద్ద నిమజ్జనం కోలాహలం ఊపందుకుంటోంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిమజ్జనంలో అందరూ పాల్గొంటున్నారు. రెండు రోజుల నుంచి నిమజ్జనాలు జరుగుతుండటంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఈఏడాది ఖైరతాబాద్ గణేశుడు మొదటగా నిమజ్జనం అవుతుండటంతో పోలీసులు అందుకోసం రూట్ క్లియరెన్స్ చేస్తున్నారు. మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైన నేపథ్యంలో మరో నాలుగుగంటల్లో విగ్రహం ఎన్టీఆర్మార్గ్కు వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. విగ్రహం ఎన్టీఆర్మార్గ్ మీదకు వచ్చిన వెంటనే సాధ్యమైనంత తొందరగా నిమజ్జనం జరిగేలా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు హుస్సేన్సాగర్ లేక్ను ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్మికుల ద్వారా శుభ్రం చేయిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







