పింక్ ప్రీమియర్ షో కి హాజరైన సినీ సెలబ్రిటీలు..
- September 16, 2016
బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్ , సొట్ట బుగ్గల సుందరి తాప్సీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం పింక్. లైంగిక దాడికి గురైన అమ్మాయి పాత్రలో తాప్సీ నటించగా, అమితాబ్ బచ్చన్ న్యాయవాదిగా కనిపించాడు. సెక్సువల్ హెరాస్మెంట్కి గురైన బాధితురాలి పాత్రను తాప్సీ పోషించింది. అయితే పింక్ చిత్రం తాజాగా విడుదల కాగా ఈ చిత్రానికి విమర్శకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని చూసేందుకు సెలబ్రిటీలు కూడా ఆసక్తి చూపుతున్నారు. పింక్ చిత్రానికి సంబంధించి రీసెంట్ గా ఓ ప్రీమియర్ షో ఏర్పాటు చేయగా ఆ షోకి హాజరైన సినీ సెలబ్రిటీలు తాప్సీ పై ప్రశంసలు కురిపించారు. అంతేకాక ఆమెతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అల్లు శిరీష్, అడవిశేషు, ఆది, సుధీర్ బాబు,సుశాంత్, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, సైనా నెహ్వల్ తదితరులు పింక్ ప్రీమియర్ షోకి హాజరయ్యారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







