'మోహన్ బాబు' సన్మాన మహోత్సవానికి టాలీవుడ్ తారలు...
- September 17, 2016
'మోహన్ బాబు'..'చిరంజీవి'.. వీరిపై టాలీవుడ్ లో రకరకాల కథనాలు వెలువడుతుంటాయి. వీరి మధ్య వైరం ఉందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తుంటాయి. తాజాగా చిరు..మోహన్ బాబుపై పలు వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్టణంలో ఆదివారం రాత్రి సుబ్బరామిరెడ్డి జన్మది వేడుకలు జరిగాయి. ఇదే వేడుకలో 'మోహన్ బాబు'కు సన్మాన కార్యక్రమం కూడా జరిగింది. ఈ మహోత్సవానికి టాలీవుడ్ తారలు...ఇతర రాజకయ నేతలు తరలివచ్చారు. ఈ వేడుకకు మెగాస్టార్ 'చిరంజీవి' కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ..ఫంక్షన్ కు రావాలని 'మోహన్ బాబు' స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారని పేర్కొన్నారు. ఇంతకు ముందు తన దగ్గర డేట్స్ ఉండేవని, కానీ ప్రస్తుతం సినిమా షూటింగ్ ఉండటంతో ఏం చేసినా ముందే ప్లాన్ చేసుకోవాల్సి వస్తోందన్నారు.వాస్తవానికి నేడు కూడా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందని, కానీ ఇక్కడికి రాకపోతే ఓ రాక్షసుడితో గొడవైపోతుందన్నారు. వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేయండని యూనిట్ సభ్యులకు చెప్పినట్టు 'చిరంజీవి' తెలిపారు. 'మోహన్ బాబు' చూపే ప్రేమ రాక్షస ప్రేమని, దాని వెనుక ఎంతో వాత్సల్యం దాగుంటుందని 'చిరంజీవి' పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









