'మోహన్ బాబు' సన్మాన మహోత్సవానికి టాలీవుడ్ తారలు...
- September 17, 2016
'మోహన్ బాబు'..'చిరంజీవి'.. వీరిపై టాలీవుడ్ లో రకరకాల కథనాలు వెలువడుతుంటాయి. వీరి మధ్య వైరం ఉందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తుంటాయి. తాజాగా చిరు..మోహన్ బాబుపై పలు వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్టణంలో ఆదివారం రాత్రి సుబ్బరామిరెడ్డి జన్మది వేడుకలు జరిగాయి. ఇదే వేడుకలో 'మోహన్ బాబు'కు సన్మాన కార్యక్రమం కూడా జరిగింది. ఈ మహోత్సవానికి టాలీవుడ్ తారలు...ఇతర రాజకయ నేతలు తరలివచ్చారు. ఈ వేడుకకు మెగాస్టార్ 'చిరంజీవి' కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ..ఫంక్షన్ కు రావాలని 'మోహన్ బాబు' స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారని పేర్కొన్నారు. ఇంతకు ముందు తన దగ్గర డేట్స్ ఉండేవని, కానీ ప్రస్తుతం సినిమా షూటింగ్ ఉండటంతో ఏం చేసినా ముందే ప్లాన్ చేసుకోవాల్సి వస్తోందన్నారు.వాస్తవానికి నేడు కూడా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందని, కానీ ఇక్కడికి రాకపోతే ఓ రాక్షసుడితో గొడవైపోతుందన్నారు. వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేయండని యూనిట్ సభ్యులకు చెప్పినట్టు 'చిరంజీవి' తెలిపారు. 'మోహన్ బాబు' చూపే ప్రేమ రాక్షస ప్రేమని, దాని వెనుక ఎంతో వాత్సల్యం దాగుంటుందని 'చిరంజీవి' పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







