ఘనంగా మోహన్బాబు 40 వసంతాల నట ప్రస్థాన వేడుక
- September 17, 2016
మో హన్బాబుకు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులున్నారని రాజ్యసభ డిప్యుటీ ఛైర్మన్ పి.జె.కురియన్ అన్నారు. శనివారం రాత్రి విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నటుడు మోహన్బాబు 40 వసంతాల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని టి.సుబ్బరామిరెడ్డి లలిత కళపరిషత్ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది.
మోహన్బాబుకు టి.ఎస్.ఆర్. లలిత కళా పరిషత్ తరపున టి.సుబ్బరామిరెడ్డి 'నవరస నట తిలకం' బిరుదును ప్రదానం చేశారు. మోహన్బాబుకు చిరంజీవి స్వర్ణ కంకణాన్ని బహుకరించారు. మోహన్బాబు ఫొటో పుస్తకాన్ని శ్రీదేవి ఆవిష్కరించారు. పెదరాయుడు చిత్ర ఫొటోల పుస్తకాన్ని సినీనటుడు వెంకటేశ్, రాఘవేంద్రరావు తదితరులు ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన కురియన్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో 40 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం అసామాన్య విషయమన్నారు. మోహన్బాబు మరో 40 సంవత్సరాలు విజయవంతంగా చిత్ర సీమలో రాణిస్తారని ఆకాంక్షించారు. తెలుగు సినీ పరిశ్రమలో దమ్మున్న నటుడు మోహన్బాబు అని పేర్కొన్నారు. చిరంజీవి మాట్లాడుతూ ''నా ఆప్తుడు మోహన్బాబు. ఇక్కడ సన్మానం జరుగుతున్నది మోహన్బాబుకి కాదు. క్రమశిక్షణకి, కష్టానికీ, పట్టుదలకీ జరుగుతున్న సన్మానిది. మనసులో గట్టిగా అనుకొంటే సాధించలేనిది ఏదీ లేదని మోహన్బాబు నిరూపించారు. నాదీ, ఆయనదీ సమాంతరంగా వస్తున్న సుదీర్ఘ ప్రయాణం. సినీ ప్రవేశం పూల పూన్పు కాదు, ముళ్లబాట. భవిష్యత్తు ఏమవుతుందనే అయోమయం ఉంటుంది. కష్టం అనే ఆయుధాన్ని చేత్తో పట్టుకొని దూసుకెళ్లాడు మోహన్బాబు. మోహన్బాబు నిజంగా ఒక పర్వతం. ఆయన పలికిన డైలాగుల్ని పుస్తకంగా వేశారు. ఆ పుస్తకాన్ని లండన్ పార్లమెంట్లో ఆవిష్కరించారు. అదొక గొప్ప గౌరవం. తన చిత్ర ప్రయాణానికి సంబంధించిన పుస్తకానికి నన్ను ముందు మాట రాయమన్నారు. అది మోహన్బాబు నాకు ఇచ్చిన ఓ గౌరవంగా భావిస్తా. మా ఇద్దరి మధ్య పొరపచ్ఛాలు ఉన్నట్టుగా, మేమేదో టామ్ అండ్ జెర్రీ అన్నట్లుగా ప్రచారం జరుగుతుంటుంది. మా మనసుల్లో అలాంటిదేమీ ఉండద''న్నారు. దాసరి నారాయణరావు మాట్లాడుతూ ''చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమిది. మోహన్బాబు నలభయ్యేళ్ల సుదీర్ఘ చరిత్రకి సన్మానం చేశారు. ఒక మనిషి ఒక సామాన్యుడు అనుకొంటే ఏ స్థాయికి చేరుతాడో చెప్పడానికే ఈ వేడుక. ఇవాళ వస్తున్న తరం చూస్తుంటే ఐదేళ్లకే అలసిపోతున్నారు. పదేళ్లు చాలనుకొంటున్నారు. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్లల్లో సుదీర్ఘమైన చరిత్ర ఉన్నవాళ్లే ఉన్నారు. మనిషి ప్రతిభ అనేది రెండోది, క్రమశిక్షణే మొదటిది. పరిశ్రమలో ఎక్కువకాలం నిలబడ్డవాళ్లంతా కృషితో పైకొచ్చినవాళ్లే. ఇలాంటి వేడుకల్ని టి.సుబ్బరామిరెడ్డి్డలాంటి వాళ్లు చేయకపోతే కళాకారుల గొప్పతనం ఎలా తెలుస్తుంది? మోహన్బాబుని నేనే పరిచయం చేశా. కేవలం పరిచయం చేసినంత మాత్రానో, నాలుగు సినిమాలు ఇచ్చినంత మాత్రానో ఒకరు ఎదగరు. ఏ క్రమశిక్షణనైతే నమ్మాడో అదే మోహన్బాబుని చరిత్రకారుడిని చేసింది. మోహన్బాబు వ్యక్తిత్వం విలక్షణమైనది. అతను ఎదుటివారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. నాకు తెలిసి పరిశ్రమలో మోహన్బాబుతోనే ఎక్కువ మంది స్నేహం చేస్తారు. మోహన్బాబు నలభయ్యేళ్ల నట ప్రయాణం పూర్తి చేసుకోవడమనేది అతని పరిచయం చేసిన ఒక గురువుగా నా కంటే ఆనందపడేవాడు మరొకడు ఉండడ''న్నారు. వెంకటేష్ మాట్లాడుతూ ''మోహన్బాబుగారు నలభయ్యేళ్ల సినీ ప
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







