కువైట్‌లో ఉర్రూతలూగించనున్న 'అమితాబ్ ఔర్ మై'

- September 18, 2016 , by Maagulf
కువైట్‌లో ఉర్రూతలూగించనున్న 'అమితాబ్ ఔర్ మై'

భారతీయులను ఉర్రూతలూగించిన 'అమితాబ్ ఔర్ మై' ఇప్పుడు కువైట్‌వాసులతో చిందులేయించడానికి సిద్ధమవుతోంది. మైదాన్ హవేలీలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఈ నెల 23న ఈ కార్యక్రమాన్ని ఇండియన్ యూత్ సొసైటీ నిర్వహిస్తోంది. 'వాయిస్ ఆఫ్ అమితాబ్'గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ గాయకుడు సుధేష్ భోసాలే 'అమితాబ్ ఔర్ మై' కార్యక్రమాన్ని రూపొందించారు. దీనికి మన దేశంతో పాటు విదేశాల్లో కూడా విపరీతమైన ఆదరణ ఉంది. 'అమితాబ్ ఔర్ మై' కార్యక్రమం మూడు గంటలపాటు జరుగుతుందని నిర్వాహకులు చెప్పారు. అమితాబ్ బచ్చన్ నటించిన సినిమాల్లోని ముఖ్యమైన ఘట్టాలన్నిటినీ ఏర్చికూర్చి సుధేష్ భోసాలే ప్రేక్షకులకు అందించబోతున్నారని చెప్పారు. పాటల రికార్డింగ్, లైవ్ కాన్సర్ట్‌లలో అమితాబ్ బచ్చన్‌తో సుధేష్ తన అనుభవాలను పంచుకుంటారన్నారు. వర్థమాన గాయకుడు అమోల్ యాదవ్, ముంబై గాయని అర్పిత ఠక్కర్, ప్రవీణ్ సరఫ్ ఆర్కెస్ట్రాలో సుప్రసిద్ధ కళాకారులు ఈ కార్యక్రమంలో ప్రేక్షకులను అలరిస్తారని చెప్పారు. ఇండియన్ యూత్ సొసైటీ అధ్యక్షుడు షబ్బీర్ కమర్ మాట్లాడుతూ గతంలో కపిల్ శర్మ, ప్రభు దేవా, ఉదిత్ నారాయణ్, సుగంధ మిశ్రా వంటి ప్రముఖ కళాకారులతో కార్యక్రమాలను నిర్వహించామన్నారు. వాటన్నిటికీ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు ఈ నెల 23న నిర్వహించే 'అమితాబ్ ఔర్ మై' కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందన్నారు.

 అమితాబ్ బచ్చన్ సినిమాల్లోని ప్రజాదరణ పొందిన పాటలను ఈ కార్యక్రమంలో పాడతారన్నారు. ఆయన డైలాగ్‌లను కూడా వినిపిస్తారన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com