కువైట్లో ఉర్రూతలూగించనున్న 'అమితాబ్ ఔర్ మై'
- September 18, 2016
భారతీయులను ఉర్రూతలూగించిన 'అమితాబ్ ఔర్ మై' ఇప్పుడు కువైట్వాసులతో చిందులేయించడానికి సిద్ధమవుతోంది. మైదాన్ హవేలీలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ నెల 23న ఈ కార్యక్రమాన్ని ఇండియన్ యూత్ సొసైటీ నిర్వహిస్తోంది. 'వాయిస్ ఆఫ్ అమితాబ్'గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ గాయకుడు సుధేష్ భోసాలే 'అమితాబ్ ఔర్ మై' కార్యక్రమాన్ని రూపొందించారు. దీనికి మన దేశంతో పాటు విదేశాల్లో కూడా విపరీతమైన ఆదరణ ఉంది. 'అమితాబ్ ఔర్ మై' కార్యక్రమం మూడు గంటలపాటు జరుగుతుందని నిర్వాహకులు చెప్పారు. అమితాబ్ బచ్చన్ నటించిన సినిమాల్లోని ముఖ్యమైన ఘట్టాలన్నిటినీ ఏర్చికూర్చి సుధేష్ భోసాలే ప్రేక్షకులకు అందించబోతున్నారని చెప్పారు. పాటల రికార్డింగ్, లైవ్ కాన్సర్ట్లలో అమితాబ్ బచ్చన్తో సుధేష్ తన అనుభవాలను పంచుకుంటారన్నారు. వర్థమాన గాయకుడు అమోల్ యాదవ్, ముంబై గాయని అర్పిత ఠక్కర్, ప్రవీణ్ సరఫ్ ఆర్కెస్ట్రాలో సుప్రసిద్ధ కళాకారులు ఈ కార్యక్రమంలో ప్రేక్షకులను అలరిస్తారని చెప్పారు. ఇండియన్ యూత్ సొసైటీ అధ్యక్షుడు షబ్బీర్ కమర్ మాట్లాడుతూ గతంలో కపిల్ శర్మ, ప్రభు దేవా, ఉదిత్ నారాయణ్, సుగంధ మిశ్రా వంటి ప్రముఖ కళాకారులతో కార్యక్రమాలను నిర్వహించామన్నారు. వాటన్నిటికీ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు ఈ నెల 23న నిర్వహించే 'అమితాబ్ ఔర్ మై' కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందన్నారు.
అమితాబ్ బచ్చన్ సినిమాల్లోని ప్రజాదరణ పొందిన పాటలను ఈ కార్యక్రమంలో పాడతారన్నారు. ఆయన డైలాగ్లను కూడా వినిపిస్తారన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







