యూఏఈ విజిట్ వీసా కొత్త రూల్
- September 18, 2016
యూఏఈ: యూఏఈ విజిట్ వీసా కొత్త రూల్ ప్రకారం, తమ విజిట్ వీసాని ఎవరైనాసరే రెసిడెన్సీ వీసాగా అయినా, ఎంప్లాయ్మెంట్ వీసాగా అయినా మార్చుకోవడానికి దేశం విడిచి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్స్ పాత రూల్స్ ప్రకారం వీసా మార్పు కోసం పొరుగు దేశాలకు వెళ్ళడమో లేదంటే స్వదేశానికి వెళ్ళడమో చేయాల్సి ఉంటుంది వలసదారులు. అయితే కొత్త విధానం ద్వారా యూఏఈలోనే వుంటూ, తమ వీసా స్టేటస్ని మార్చుకోవచ్చు. కొత్త ఉద్యోగాల్ని వెతుక్కున్న వలసదారులకు ఈ కొత్త నిబంధన ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఈ స్టేటస్ని మార్చుకునే సౌకర్యం వల్ల, వలసదారులు ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. చాలా త్వరగా ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. వలసదారుల కుటుంబ సభ్యులకు ఈ విధానం ఎంతో ఉపయోగకరం అని రెసిడెన్సీ అండ్ పోర్ట్స్ డిపార్ట్మెంట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అఇకార ప్రతినిథి రషీద్ సుల్తాన్ అల్ ఖాదర్ ఈ వివరాల్ని వెల్లడించారు. ట్రాన్సిట్ వీసాలు, షార్ట్ టెర్మ్, లాంగ్ టెర్మ్, స్టూడెంట్, మెడికల్ ట్రీట్మెంట్, రెసిడెన్స్ వీసాలకూ ఈ కొత్త విధానం వర్తిస్తుంది. విజిటర్స్ తమ వీసా రెన్యూవల్ కోసం 570 దిర్హామ్స్ చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









