ఎమిరేటీ, ఎక్స్పాట్ పేషెంట్లకు ఉచిత వైద్య చికిత్స
- September 19, 2016
అబుదాబీ: పేషెంట్లు, వారి సంబంధీకులు, వ్యక్తులు కొన్ని ప్రత్యేక డిసీజ్లకు ఉచిత వైద్య చికిత్స పొందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆంత్రాక్స్, కలరా, అవియాన్ ఇన్ఫ్లుయెంజా, హెచ్ఐవి ఎయిడ్స్ వంటి వ్యాధులకు చిత చికిత్స అందించనున్నారు. ఆరు నెలల్లో దీనికి సంబందించిన చట్టం అమల్లోకి రానుంది. పౌరులు అలాగే, విజిట్ లేదా రెసిడెన్స్ వీసాతో దేశంలో ఉంటున్నవారికి ఈ వైద్య చికిత్స అందుతుంది. ఫుడ్ పాయిజనింగ్, డిఫ్తీరియా, అక్యూట్ ఫ్లాసిడ్ పరాలసిస్, బోటులిజమ్ మరికొనిన వ్యాధులకు కూడా ఈ వైద్య చికిత్సలో కవర్ ఉంటుంది. ఉచిత హెల్త్ కేర్లో వైద్య పరీక్షలు, చికిత్స, మందులు, వాక్సినేషన్ వంటివి కూడా ఉంటాయి. చట్టం ప్రకారం వ్యాధిగ్రస్తులకు పూర్తి ప్రైవసీ కూడా ఇస్తారు. అయితే డిపోర్టేషన్ రూల్స్ మాత్రం యధాతథంగా ఉంచారు వలసదారులకు సంబంధించి. వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు సంబంధిత ఆసుపత్రులు లేదా క్లినిక్స్లో సంప్రదించి, తమ వివరాల్ని నమోదు చేసుకోవలసి ఉంటుందనీ, ఆయా వ్యాధులకు వైద్య చికిత్స, మెడికల్ కౌన్సిలింగ్ వంటివి నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







