జెడ్డా లో 18 మాంస దుకాణాలు...28 అక్రమ కమ్మీల తొలగింపు
- September 20, 2016
జెడ్డా : ఆహార రంగంలో పరిశుభ్రత, రక్షణ మరియు భద్రతా నిర్ధారించడానికి జెడ్డా మున్సిపాలిటీ ప్రయత్నాల్లో భాగంగా అధికారులు అక్రమ మాంస దుకాణాలని మరియు మాంసం విక్రయిస్తూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడే దృష్టి కేంద్రీకరించారు. పురపాలక పరిధిలో ఖుర్భానీ (త్యాగం) చేయని జంతువులని చంపరాదని పురపాలక శాఖ కేటాయినా స్థలాల్లో కాక ఇళ్ళు వెలుపల జీవాలను చంపదాన్ని ఈద్ అల్ అధా కాలంలో అనారోగ్య జంతువులని యాదృచ్ఛిక అమ్మకం జరపడం నిషేధిస్తూ ఒక నిబంధన జారీ చేసింది.
దక్షిణ జెడ ఉప పురపాలక శాఖ ముఖ్యులు మహమ్మద్ అల్ జహ్రాని మాట్లాడుతూ మాంస విక్రయాలలో అక్రమ కార్యకలాపాలలో అన్ని రకాల అనారోగ్య పరిస్థితులను అరికట్టేందుకు రెస్టారెంట్లు, దుకాణాలు మరియు ఆహార కేంద్రాలలో తమ నిఘానేత్రం ఎల్లప్పుడూ ఉంచి సురక్షితమైన ఆహార పదార్ధాలు ప్రజలకు పంపిణీ కాబడేలా పురపాలక సంఘం యొక్క నిబద్ధత కొనసాగుతుందని ఆయన తెలిపారు.
జెడ్డా ఉప మున్సిపాలిటీ పరిధిలో 18 అక్రమ అమ్మకాలు జరిపే ఇళ్ళు మరియు జెడ దక్షిణాదిలో కేంద్ర పశువుల మార్కెట్ సమీపంలో మేకలు మరియు గొర్రెలని వేలాడదీసి విక్రయించే 28 కమ్మీలను ఈద్ అల్ అధా కాలంలో నాలుగు రోజులలో మూసివేయించినట్లు ఆయన వివరించాడు. ఈద్ కాలంలో దక్షిణ ఉప పురపాలక అధికారులు పలు ప్రాంతంలో అనేక యాదృచ్ఛిక స్థలాలను మరియు కబేళాలలో విక్రయాలని నియంత్రించినట్లు వివరించారు మరియు భద్రత మరియు పరిశుభ్రత పరంగా పురపాలక శాఖ అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







