రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన స్వేచ్ఛ తొలి ఫలితాన్ని ఇచ్చింది..
- September 20, 2016
భారత సైనికులను హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన స్వేచ్ఛ తొలి ఫలితాన్ని ఇచ్చింది. ఊరీ సెక్టార్లో ఉగ్రవాదుల చొరబడేందుకు వీలు కలిగేలా పాక్ దళాలు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డాయి. వేగంగా స్పందించిన భారత దళాలు పాక్ దాడులను తిప్పి కొట్టే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ డీజీకి ఫోన్ చేసి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రెచ్చిపోయిన ఆర్మీ పాక్ దళాలపై విరుచుకుపడింది. కాల్పుల మాటున ఉగ్రవాదులను భారత్లోకి పంపించాలన్న వ్యూహాన్ని భారత దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఆర్మీ కాల్పుల్లో కనీసం 9 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. మరింతమంది మరణించి ఉండవచ్చిన ఆర్మీ అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







