హీరోగా మళ్లీ యు-టర్న్ తీసుకుంటున్న జగపతిబాబు..
- September 20, 2016
'లెజెండ్'తో జగపతిబాబు కెరీర్ కొత్త టర్న్ తీసుకుంది. అప్పటివరకూ హీరోగా నటించిన ఆయన విలన్గా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు. హీరోగా ఫీమేల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జగపతిబాబు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, డ్రస్సింగ్ స్టైల్, స్టైలిష్ యాక్టింగ్తో విలన్గా కూడా ఫీమేల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. వరుసగా నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలు చేస్తున్న ఆయన హీరోగా మళ్లీ యు-టర్న్ తీసుకుంటున్నారు. జగపతిబాబు హీరోగా నటించబోయే కొత్త చిత్రం నవంబర్లో సెట్స్పైకి వెళ్లనుంది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి ఈ సినిమాను నిర్మించనున్నారు. దర్శకుడు, ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఇక, తనయుడు నిఖిల్కుమార్ని హీరోగా పరిచయం చేస్తూ కుమారస్వామి నిర్మించిన 'జాగ్వార్'లో జగపతిబాబు విలన్గా నటించారు.'జాగ్వార్'తో నాకో మంచి మిత్రుడు లభించాడని కుమారస్వామిని ఉద్దేశించి ఇటీవల ఆడియో వేడుకలో జగపతిబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







