హైదరాబాద్ ఆర్టీసీ పరిధిలో 115 ఏసీ బస్సుల్లో త్వరలోనే వైఫై సేవలు !
- September 20, 2016
గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ పరిధిలో 115 ఏసీ బస్సుల్లో త్వరలోనే వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరో వారం రోజుల్లోనే ఈ వైఫై సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ పురుషోత్తం తెలిపారు. ఏసీ బస్సులు ఎక్కే ప్రయాణికులు మొదటి 25 నిమిషాలు ఉచితంగా వైఫై సేవలు పొందవచ్చని ఆయన చెప్పారు. 25 నిమిషాల తర్వాత కూడా వైఫై వాడాలనుకునే ప్రయాణికులు సాధారణ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ చార్జీలపై బస్సులలో ప్రకటనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వైఫై సేవలు అందించేందుకు రూరల్ ఇండియా సంస్థ ముందుకు వచ్చిందన్నారు.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మరిన్ని కొత్త ప్రణాళికలు అమలు చేస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







