బంగారం, వెండి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి

- September 22, 2016 , by Maagulf
బంగారం, వెండి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం, వెండి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వరుసగా ఐదో రోజు పసిడి ధర పెరిగి.. రెండు వారాల గరిష్ఠానికి చేరగా.. వెండి ఒక్కరోజే రూ. 600 పెరిగి రూ.46వేల పైకి చేరింది.దేశీయ మార్కెట్లో గురువారం బంగారం ధర రూ. 300 పెరిగింది. దీంతో99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి రూ. 31,550గా ఉంది. మరోవైపు ఒక్కరోజే రూ. 600 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 46,800కు చేరింది. నగల వ్యాపారులు, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో ఈ లోహాల ధరలు పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com