ఇతడ్ని మీరు ఎక్కడైనా చూశారా?
- September 22, 2016
రాయ్గఢ్ జిల్లాలోని ఉరాన్ సైనిక స్థావరం వద్ద అనుమానితుల సంచారంపై ముంబయి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తీర ప్రాంతంలో రెండో రోజు తనిఖీలు కొనసాగిస్తున్నారు. విద్యార్థులు అందించిన సమాచారం మేరకు.. ఓ అనుమానితుడి వూహాచిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు.
ముంబయిలో గురువారం అనుమానితుల సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఉరాన్ సైనిక స్థావరం సమీపంలో పఠాన్ సూట్లు వేసుకున్న ఐదుగురు వ్యక్తులు, సాధారణ దుస్తుల్లో ఉన్న మరో వ్యక్తి ఆయుధాలతో తిరుగుతున్నారని కొందరు పాఠశాల విద్యార్థులు స్కూల్ యాజమాన్యానికి చెప్పారు.
దీంతో వారు పోలీసులకు సమాచారమందించారు. దీంతో ముంబయి తీరం, పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రంగంలోకి దిగిన ఏటీఎస్, రాష్ట్ర పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.
ఉరీ ఉగ్రదాడి తరువాత దేశంలోని పలు సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు దాడులు చేయొచ్చని నిఘా వర్గాలు హెచ్చరికల జారీచేశాయి. ఈ నేపథ్యంలో అనుమానితుల సంచారంపై సమాచారం రావడంతో నౌకాదళం అప్రమత్తమైంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









