ఇతడ్ని మీరు ఎక్కడైనా చూశారా?
- September 22, 2016
రాయ్గఢ్ జిల్లాలోని ఉరాన్ సైనిక స్థావరం వద్ద అనుమానితుల సంచారంపై ముంబయి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తీర ప్రాంతంలో రెండో రోజు తనిఖీలు కొనసాగిస్తున్నారు. విద్యార్థులు అందించిన సమాచారం మేరకు.. ఓ అనుమానితుడి వూహాచిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు.
ముంబయిలో గురువారం అనుమానితుల సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఉరాన్ సైనిక స్థావరం సమీపంలో పఠాన్ సూట్లు వేసుకున్న ఐదుగురు వ్యక్తులు, సాధారణ దుస్తుల్లో ఉన్న మరో వ్యక్తి ఆయుధాలతో తిరుగుతున్నారని కొందరు పాఠశాల విద్యార్థులు స్కూల్ యాజమాన్యానికి చెప్పారు.
దీంతో వారు పోలీసులకు సమాచారమందించారు. దీంతో ముంబయి తీరం, పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రంగంలోకి దిగిన ఏటీఎస్, రాష్ట్ర పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.
ఉరీ ఉగ్రదాడి తరువాత దేశంలోని పలు సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు దాడులు చేయొచ్చని నిఘా వర్గాలు హెచ్చరికల జారీచేశాయి. ఈ నేపథ్యంలో అనుమానితుల సంచారంపై సమాచారం రావడంతో నౌకాదళం అప్రమత్తమైంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







