క్యాబ్ డ్రైవర్ నిజాయితీ
- September 23, 2016
షార్జా: పాకిస్తానీ డ్రైవర్ నాసిబల్లా షీర్, తన ట్యాక్సీలో ప్రయాణీకులు మర్చిపోయిన బ్యాగ్ని తిరిగిచ్చి తన నిజాయితీని చాటుకున్నాడు. కొరియాకి చెందిన వ్యాపారవేత్త ఒకరు, షీర్కి చెందిన క్యాబ్లో షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణించాడు. అయితే ఆ వ్యాపారవేత్త కంగారులో తన బ్యాగ్ని ట్యాక్సీలో మర్చిపోయాడు. అది గమనించిన ట్యాక్సీ డ్రైవర్ షీర్, తనకు లభించిన బ్యాగ్ని ఎయిర్పోర్ట్లోని ఆర్టిఎ ట్యాక్సీ ఆఫీస్లో అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. షార్జా పోలీసులు కొరియన్ విజిటర్ని గుర్తించి, ఆ బ్యాగ్ని అందజేశారు. సార్జా ఆర్టిఎ ట్రాన్స్పోర్ట్ ఎఫైర్స్ డైరెక్టర్ అబ్దుల్ అల్ జర్వాన్, షీర్ నిజాయితీని గుర్తించి, ఆయన్ని ఘనంగా సన్మానించారు. ఇటీవలి కాలంలో మొత్తం 265 మంది క్యాబ్ డ్రైవర్లు ఈ విధంగా స్మనించబడ్డారు. వారికి 310,000 క్యాష్ ప్రైజ్ని కూడా అందించినట్లు షార్జా ఆర్టిఎ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









