క్యాబ్ డ్రైవర్ నిజాయితీ
- September 23, 2016
షార్జా: పాకిస్తానీ డ్రైవర్ నాసిబల్లా షీర్, తన ట్యాక్సీలో ప్రయాణీకులు మర్చిపోయిన బ్యాగ్ని తిరిగిచ్చి తన నిజాయితీని చాటుకున్నాడు. కొరియాకి చెందిన వ్యాపారవేత్త ఒకరు, షీర్కి చెందిన క్యాబ్లో షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణించాడు. అయితే ఆ వ్యాపారవేత్త కంగారులో తన బ్యాగ్ని ట్యాక్సీలో మర్చిపోయాడు. అది గమనించిన ట్యాక్సీ డ్రైవర్ షీర్, తనకు లభించిన బ్యాగ్ని ఎయిర్పోర్ట్లోని ఆర్టిఎ ట్యాక్సీ ఆఫీస్లో అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. షార్జా పోలీసులు కొరియన్ విజిటర్ని గుర్తించి, ఆ బ్యాగ్ని అందజేశారు. సార్జా ఆర్టిఎ ట్రాన్స్పోర్ట్ ఎఫైర్స్ డైరెక్టర్ అబ్దుల్ అల్ జర్వాన్, షీర్ నిజాయితీని గుర్తించి, ఆయన్ని ఘనంగా సన్మానించారు. ఇటీవలి కాలంలో మొత్తం 265 మంది క్యాబ్ డ్రైవర్లు ఈ విధంగా స్మనించబడ్డారు. వారికి 310,000 క్యాష్ ప్రైజ్ని కూడా అందించినట్లు షార్జా ఆర్టిఎ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







