కశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
- September 23, 2016
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండ ప్రాంతంలో వెళ్తున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాందంలో బస్సులో ప్రయాణిస్తున్న 23 మంది మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ముజఫరాబాద్ కు ఉత్తర దిశగా 45 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అదుపుతప్పిన బస్సు.. సుమారు 100 మీటర్ల ఎత్తునుంచి వేగంగా ప్రవహిస్తున్న నదిలో పడటంతో కొట్టుకుపోయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో 23 మందికి పైగానే మృతిచెందారని, తీవ్రంగా గాయపడిన ముగ్గురిని రక్షించడంతో పాటు.. ముగ్గురి మృతదేహాలు మాత్రం లభించాయని స్థానిక అధికారి గిలానీ వెల్లడించారు. నదిలో కొట్టుకుపోయిన బస్సుతో పాటు మృతదేహాలకోసం గాలింపు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







