రొమేనియాలో భూకంపం, రిక్టర్‌ స్కేలుపై 5.3గా నమోదు

- September 24, 2016 , by Maagulf
రొమేనియాలో భూకంపం, రిక్టర్‌ స్కేలుపై 5.3గా నమోదు

శనివారం ఉదయం రొమేనియాలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. పొరుగున ఉన్న బల్గేరియా, మోల్దోవాలలోనూ ప్రకంపనలు నమోదైనట్లు తెలుస్తోంది. వ్రాన్సియాలో 91.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు భూ విజ్ఞాన శాస్త్ర అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రమాదం ఉన్న ప్రాంతమని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఇవాళ్టి భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని పేర్కొన్నారు. 1977లో ఇక్కడ 7.2 తీవ్రతతో భూకంపం సంభవించినపుడు 1500 మంది ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com