రొమేనియాలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదు
- September 24, 2016
శనివారం ఉదయం రొమేనియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. పొరుగున ఉన్న బల్గేరియా, మోల్దోవాలలోనూ ప్రకంపనలు నమోదైనట్లు తెలుస్తోంది. వ్రాన్సియాలో 91.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు భూ విజ్ఞాన శాస్త్ర అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రమాదం ఉన్న ప్రాంతమని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఇవాళ్టి భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని పేర్కొన్నారు. 1977లో ఇక్కడ 7.2 తీవ్రతతో భూకంపం సంభవించినపుడు 1500 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







