బాగ్దాద్లో ఒకేసారి మూడు ఆత్మాహుతి దాడులు, 11 మంది మృతి
- September 24, 2016
ఉత్తర బాగ్దాద్లో శనివారం జరిగిన మూడు ఆత్మాహుతి దాడుల్లో 11 మంది సైనికులు మృతిచెందారు. ముగ్గురు ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో వున్న వాహనాలతో ఒకేసారి భద్రతా సిబ్బంది ఉండే చెక్ పాయింట్ లోపలికి దూసుకువచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా మరో 34 మంది సైనికులు గాయపడ్డారని పోలీస్ అధికారులు వెల్లడించారు. స్థానిక పోలీస్ ఉన్నతాధికారి, ప్రొవిన్షియల్ సెక్యూరిటీ కమిటీ అధిపతి చెక్పాయింట్ను సందర్శిస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని, వారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని భద్రతా సిబ్బంది తెలిపారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఉగ్రవాద సంస్థలేవీ ప్రకటన చేయలేదని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







