బాగ్దాద్లో ఒకేసారి మూడు ఆత్మాహుతి దాడులు, 11 మంది మృతి
- September 24, 2016
ఉత్తర బాగ్దాద్లో శనివారం జరిగిన మూడు ఆత్మాహుతి దాడుల్లో 11 మంది సైనికులు మృతిచెందారు. ముగ్గురు ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో వున్న వాహనాలతో ఒకేసారి భద్రతా సిబ్బంది ఉండే చెక్ పాయింట్ లోపలికి దూసుకువచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా మరో 34 మంది సైనికులు గాయపడ్డారని పోలీస్ అధికారులు వెల్లడించారు. స్థానిక పోలీస్ ఉన్నతాధికారి, ప్రొవిన్షియల్ సెక్యూరిటీ కమిటీ అధిపతి చెక్పాయింట్ను సందర్శిస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని, వారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని భద్రతా సిబ్బంది తెలిపారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఉగ్రవాద సంస్థలేవీ ప్రకటన చేయలేదని తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









