బాగ్దాద్‌లో ఒకేసారి మూడు ఆత్మాహుతి దాడులు, 11 మంది మృతి

- September 24, 2016 , by Maagulf
బాగ్దాద్‌లో ఒకేసారి మూడు ఆత్మాహుతి దాడులు, 11 మంది మృతి

ఉత్తర బాగ్దాద్‌లో శనివారం జరిగిన మూడు ఆత్మాహుతి దాడుల్లో 11 మంది సైనికులు మృతిచెందారు. ముగ్గురు ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో వున్న వాహనాలతో ఒకేసారి భద్రతా సిబ్బంది ఉండే చెక్‌ పాయింట్‌ లోపలికి దూసుకువచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా మరో 34 మంది సైనికులు గాయపడ్డారని పోలీస్‌ అధికారులు వెల్లడించారు. స్థానిక పోలీస్‌ ఉన్నతాధికారి, ప్రొవిన్షియల్‌ సెక్యూరిటీ కమిటీ అధిపతి చెక్‌పాయింట్‌ను సందర్శిస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని, వారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని భద్రతా సిబ్బంది తెలిపారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఉగ్రవాద సంస్థలేవీ ప్రకటన చేయలేదని తెలిపారు.​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com