క్యారెట్తో దంత సంరక్షణ
- August 10, 2015
అప్పుడప్పుడు పళ్ల చిగుళ్లు వాచి, వాటి నుండి రక్తస్రావం అవుతూ చాలా బాధిస్తాయి. నోటి నుండి దుర్వాసన కూడా వస్తుంది. కూల్ డ్రింక్స్, ఎక్కువ కలర్ ఉన్న ఫ్రూట్ జ్యూసెస్, బీట్ రూట్ లాంటివి తాగినప్పుడు పళ్ల మీద ప్రభావం చూపిస్తాయి. తద్వారా పళ్లు రంగు మారి పసుపు పచ్చగా మారిపోతాయి. ఈ మరకలను తొలగించుకోవడానికి తరచుగా క్యారెట్, యాఫిల్లాంటి పళ్లు తినడం వల్ల పళ్ల మధ్యలో ఇరుక్కున్న ఆహారం తొలగిపోవడమే కాకుండా పళ్ల మీద ఏర్పడిన మరకలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అంతేకాదు వారానికి ఒక్కసారైనా కనీసం బేకింగ్ సోడాను టూత్ బ్రష్ మీద వేసుకుని బ్రష్ చేసుకోవడం వల్ల పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహారం ద్వారా ఏర్పడే సూక్ష్మక్రిములు, బాక్టీరియా తొలగిపోయి పళ్లు తాజాగా ఉంటాయి. వెనిగర్ పళ్ల మీద ఏర్పడిన మరకలను తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. వెనిగర్లో కొద్దిగా నీళ్లు కలిపి పుక్కిలిస్తూ ఉండాలి. మనం వాడే టూత్ బ్రష్ రెండు మూడు నెలలకోసారి మారుస్తూ ఉండాలి.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







