క్యారెట్తో దంత సంరక్షణ
- August 10, 2015
అప్పుడప్పుడు పళ్ల చిగుళ్లు వాచి, వాటి నుండి రక్తస్రావం అవుతూ చాలా బాధిస్తాయి. నోటి నుండి దుర్వాసన కూడా వస్తుంది. కూల్ డ్రింక్స్, ఎక్కువ కలర్ ఉన్న ఫ్రూట్ జ్యూసెస్, బీట్ రూట్ లాంటివి తాగినప్పుడు పళ్ల మీద ప్రభావం చూపిస్తాయి. తద్వారా పళ్లు రంగు మారి పసుపు పచ్చగా మారిపోతాయి. ఈ మరకలను తొలగించుకోవడానికి తరచుగా క్యారెట్, యాఫిల్లాంటి పళ్లు తినడం వల్ల పళ్ల మధ్యలో ఇరుక్కున్న ఆహారం తొలగిపోవడమే కాకుండా పళ్ల మీద ఏర్పడిన మరకలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అంతేకాదు వారానికి ఒక్కసారైనా కనీసం బేకింగ్ సోడాను టూత్ బ్రష్ మీద వేసుకుని బ్రష్ చేసుకోవడం వల్ల పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహారం ద్వారా ఏర్పడే సూక్ష్మక్రిములు, బాక్టీరియా తొలగిపోయి పళ్లు తాజాగా ఉంటాయి. వెనిగర్ పళ్ల మీద ఏర్పడిన మరకలను తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. వెనిగర్లో కొద్దిగా నీళ్లు కలిపి పుక్కిలిస్తూ ఉండాలి. మనం వాడే టూత్ బ్రష్ రెండు మూడు నెలలకోసారి మారుస్తూ ఉండాలి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









