మంచు విష్ణు వరద బాధితులకు సాయం...
- September 25, 2016
హీరో మంచు విష్ణు ప్రస్తుతం 'లక్కున్నోడు' చిత్రం చేస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా వరదలో చిక్కుకుపోయిన వారిని ఆదుకోవడానికి షూటింగ్కి కాస్త బ్రేక్ ఇచ్చి సహాయక చర్యలు చేపట్టాడు. హైదరాబాద్లోని విష్ణు స్ర్పింగ్ బోర్డు అకాడమీ క్యాంపస్లోని 20కి పైగా బ్రాంచీల వారి సహకారంతో బాధితులకు ఆహారం, నీరు, బ్లాంకెట్స్ అందజేస్తున్నారు. అలాగే ఇక్కడ జనరేటర్స్ సహాయంతో స్పెషల్ చార్జింగ్ పాయింట్స్ను కూడా పెట్టారు.దీంతో మొబైల్స్, మిగతా ఎలక్ర్టానిక్ పరికరాలను చార్జింగ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. సహాయం కోసం నిజాంపేట, కె.పి.హెచ్.బి కాలనీ, నాచారం, మియాపూర్లలోని స్ప్రింగ్ బోర్డ్ అకాడమీలలో సంప్రదించాలి అని చెప్పారు. శనివారం నుండి మూడు రోజుల వరకు విష్ణు అండ్ టీం ఈ సహాయ కార్యక్రమాలను అందించనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







