'ఇజం'లో తారక్ వాయిస్...
- September 25, 2016
పూరీ జగన్నాథ్ - కళ్యాణ్ రామ్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇజం'. ఇందులో ఎన్టీఆర్ ఓ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నాడనే ప్రచారం జరిగింది. త్వరలోనే తారక్ పై సీన్స్ చిత్రీకరిస్తారని చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా తారక్ 'ఇజం'లో గెస్ట్ రోల్ లో మెరిసేందుకు తిరస్కరించినట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. పూరి, కళ్యాణ్ ఎంత కన్విన్స్ చేసినా తారక్ వినలేదట.ఇద్దరం కలిసి నటిస్తున్నప్పుడు సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలుంటాయని.. వాటికి తగ్గ కథలో నటిస్తే బాగుంటుంది. కానీ, చిన్న రోల్లో చేస్తే సినిమాకు ఏం ఉపయోగం ఉండదని తారక్ పూరి, కళ్యాణ్ లని కన్విన్స్ చేసినట్టు తెలుస్తోంది. తారక్ చెప్పింది కూడా నిజమేనని కళ్యాణ్ కామ్ అయిపోయినట్టు తెలుస్తోంది.కాకపోతే, 'ఇజం'లో తారక్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడంట. ఇక, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు కలసి నటించే చిత్రం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరైన కథ దొరికితే.. ఈ నందమూరి మల్టీస్టారర్ పట్టాలెక్క అవకాశాలున్నాయ్. మరి.. నందమూరి మల్టీస్టారర్ ని తయారు చేసే దర్శకుడు ఎవరన్నది చూడాలి. దీంతో సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ మాత్రమే తీసుకున్నారని చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









