అమెరికాలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నా రామ్చరణ్..
- September 25, 2016
మెగాపవర్ స్టార్ రామ్చరణ్ ప్రస్తుతం 'ధృవ' షూటింగ్లోనూ, అలాగే తన తండ్రి 150వ సినిమాకు నిర్మాతగానూ చాలా బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో కూడా రామ్చరణ్ ఓ సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రిపబ్లికన్ హిందూ కూలిషన్స్ చైర్మన్ శాలికుమార్ ఆహ్వనం మేరకు అమెరికాలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు. 'హ్యూమేనిటి యునైటెడ్ ఎగనిస్ట్ టెర్రర్' పేరిట న్యూజెర్సీలోని పిఎన్సి ఆర్ట్ సెంటర్లో అక్టోబర్ 15న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ చెర్రీ తన ఫేస్బుక్ అకౌంట్లో వీడియో పోస్ట్ చేశాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







