నయీం గ్యాంగ్ నుంచి తనకు బెందిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపిన వర్మ..
- September 26, 2016
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెర తీస్తున్నాడు. ఇప్పటికే నిజజీవిత సంఘటన ఆధారంగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న వర్మ, ఇటీవల ఎన్ కౌంటర్ లో మరణించిన నయీం జీవితం ఆధారంగా సినిమాను రూపొందించనున్నట్టుగా ప్రకటించాడు. ఇప్పటికే నయీం జీవితంపై రిసెర్చ్ స్టార్ట్ చేసిన వర్మ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.నయీం గ్యాంగ్ నుంచి తనకు బెందిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపిన వర్మ.. ఇలాంటి కాల్స్ కు భయపడేది లేదని.. తాను నయీం లకే నయీం నని తెలిపాడు. ప్రస్తుతం ముంబైలో నయీంతో పాటు జైల్ లో ఉన్న వ్యక్తిని, నయీం కేసుకు సంబందించిన పోలీసు అధికారులను, నయీంతో కలిసి పని చేసిన ఇద్దరు నక్సలైట్ లను కలిసినట్టుగా వెల్లడించాడు.కరాచీలో ఉండే ఓ పెద్ద వ్యక్తితో నయీంకు సన్నిహిత సంబందాలు ఉన్నాయని తెలిసి తాను షాక్ అయ్యానన్నాడు. నయీం కథతో తెరకెక్కుతున్న సినిమాను జనవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. తన గత సినిమాల మాధిరిగానే తన వాయిస్ ఓవర్ తో నయీం టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశాడు వర్మ.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









