నయీం గ్యాంగ్ నుంచి తనకు బెందిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపిన వర్మ..
- September 26, 2016
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెర తీస్తున్నాడు. ఇప్పటికే నిజజీవిత సంఘటన ఆధారంగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న వర్మ, ఇటీవల ఎన్ కౌంటర్ లో మరణించిన నయీం జీవితం ఆధారంగా సినిమాను రూపొందించనున్నట్టుగా ప్రకటించాడు. ఇప్పటికే నయీం జీవితంపై రిసెర్చ్ స్టార్ట్ చేసిన వర్మ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.నయీం గ్యాంగ్ నుంచి తనకు బెందిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపిన వర్మ.. ఇలాంటి కాల్స్ కు భయపడేది లేదని.. తాను నయీం లకే నయీం నని తెలిపాడు. ప్రస్తుతం ముంబైలో నయీంతో పాటు జైల్ లో ఉన్న వ్యక్తిని, నయీం కేసుకు సంబందించిన పోలీసు అధికారులను, నయీంతో కలిసి పని చేసిన ఇద్దరు నక్సలైట్ లను కలిసినట్టుగా వెల్లడించాడు.కరాచీలో ఉండే ఓ పెద్ద వ్యక్తితో నయీంకు సన్నిహిత సంబందాలు ఉన్నాయని తెలిసి తాను షాక్ అయ్యానన్నాడు. నయీం కథతో తెరకెక్కుతున్న సినిమాను జనవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. తన గత సినిమాల మాధిరిగానే తన వాయిస్ ఓవర్ తో నయీం టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశాడు వర్మ.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







