మినిస్టర్స్ జీతాల్లో 20 శాతం కోత
- September 27, 2016
రియాద్: కింగ్ సల్మాన్, సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్స్ జీతాల్లో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాయల్ డిక్రీని విడుదల చేశారు. ఈ డిక్రీ ప్రకారం మినిస్టర్స్ జీతాల్లో 20 శాతం కోత పడుతుంది. షౌరా కౌన్సిల్ సభ్యులకు హౌసింగ్ మరియు ఫర్నిషింగ్ కోసం ఇస్తున్న యాన్యువల్ సబ్సిఇడీలో 15 శాతం కోత విధించేలా డిక్రీలో పేర్కొన్నారు. అలాగే, హై ర్యాంకింగ్ అధికారులకు కార్లను ఇవ్వడంపైన కూడా సస్పెన్షన్ని విధించారు. ల్యాండ్లైన్, మొబైల్ ఫోన్ల ఖర్చులు కూడా మంత్రులు, ఆయా అధికారులే చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే హిజ్రి ఇయర్తో ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. అయితే జీతాల్లో కోత నుంచి సదరన్ బోర్డర్లో విధులు నిర్వహిస్తున్న మిలిటరీ, ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న వారికి మినహాయింపు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







