వేలాడే గాజు వంతెన పునఃప్రారంభం...
- September 28, 2016
గత కొన్ని రోజులుగా మూసివేసిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, పొడవైన వేలాడే గాజు వంతెనను చైనా తిరిగి ప్రారంభించనుంది. అక్టోబర్లో చైనా గోల్డెన్ వీక్ హాలిడేని పురస్కరించుకుని సెప్టెంబర్ 30వ తేదీన ఈ గాజు వంతెనపై పర్యాటకులకు తిరిగి అనుమతించనుంది.చైనాలోని జాంగ్జియాంగ్జి అనే ప్రాంతంలో గ్రాండ్ కానియన్ సెనిక్ ప్రాంతంపై ఈ వంతెనను నిర్మించారు. యునెస్కో కూడా దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపునిచ్చింది. ఆగస్టు 20వ తేదీని దీనిని ప్రారంభించగా అనూహ్యంగా సందర్శకుల తాకిడి రోజుకు పదివేలకు పెరిగింది.
సూచనలు, హెచ్చరికలను ప్రవేశపెట్టిన బ్రిడ్జి కమిటీ
దీంతో వంతెనపై కొద్దిపాటి పగుళ్లు వచ్చాయి. దీంతో పలు మార్పులు, చేర్పులు చేశారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి రోజుకు 8000మంది పర్యాటకులకు అనుమతించేలా బ్రిడ్జి నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు సూచనలు, హెచ్చరికలను కూడా ప్రవేశపెట్టింది.
వెబ్సైట్లో రిజిస్ట్రర్ చేసుకోవాలి
ఈ గాజు వంతెనను వీక్షించాలనుకునే వారు ముందుగా వెబ్సైట్లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. ఇలా చేస్తే వారికి గుర్తింపు కార్డులను ఇస్తారు. తద్వారా స్వైప్ చేసి బ్రిడ్జిని చూసేందుకు వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు హై హీల్స్ వేసుకున్న పర్యాటకులకు అనుమతించడం లేదు.
బ్రిడ్జి ముందు మానిటరింగ్ సిస్టమ్
ఎలాంటి వ్యక్తిగత వస్తువులను కూడా ఈ వంతెనపైకి అనుమతించబోమని స్పష్టం చేశారు. బ్రిడ్జి ముందు మార్గంలో ఇంటెలిజెంట్ మానిటరింగ్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేశారు. తద్వారా సందర్శకుల తాకిడిని కొంత మేరకు తగ్గించవచ్చని కమిటీ పేర్కొంది. డిజైన్, నిర్మాణంలో ఈ బ్రిడ్జి ప్రపంచంలో 10 అత్యుత్తమ రికార్డును సొంతం చేసుకుంది.
టీకెట్ ధర రూ. 1400
ఈ బ్రిడ్జిని వీక్షించేందుకు టీకెట్ ధరను 138 యాన్ ($21) నిర్ణయించారు. ఇక భారతీయ కరెన్సీలో రూ.1400 వరకు చెల్లించాల్సి ఉంటుంది. సుమారు నెల రోజులపాటు ఈ వంతెనను మూసి వేసిన అధికారులు కొన్ని సాంకేతిక పరమైన మార్పులు చేశారు. 430 మీటర్ల పొడవుతో ఆరు మీటర్ల వెడల్పుతో ఈ వంతెనను నిర్మించి దానిపై మూడు వేర్వేరు లేయర్లతో రూపొందించిన 99 దళసరి గాజు పలకలను అమర్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







