దసరా పండగ కి రైల్వే సిబ్బందికి 78 రోజుల బోనస్‌..

- September 28, 2016 , by Maagulf
దసరా పండగ కి రైల్వే సిబ్బందికి 78 రోజుల బోనస్‌..

పండుగ కానుకగా రైల్వే సిబ్బందికి ఈ ఏడాది కూడా 78రోజుల బోనస్‌ ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకతతో ముడిపడి ఉన్న బోనస్‌(పీఎల్‌బీ) ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. గతేడాది వరకు పీఎల్‌బీపై ఉన్న పరిమితి రూ.3,500 నుంచి రూ.7వేలకు పెరగడంతో.. ఈ ఏడాది ఉద్యోగులకు దాదాపు రూ.18వేల చొప్పున బోనస్‌ లభించనుంది. ఈ బోనస్‌తో దాదాపు 13లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లాభం చేకూరనుంది. ఈసారి బోనస్‌తో రైల్వేపై దాదాపు రూ.2వేల కోట్ల అదనపు భారం పడనుంది. గత నాలుగేళ్లలోనూ రైల్వే సిబ్బందికి 78రోజుల వేతనాన్ని బోనస్‌గా అందిస్తున్నారు.దసరా పండగ ముందే బోనస్‌ ఇస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com