దసరా పండగ కి రైల్వే సిబ్బందికి 78 రోజుల బోనస్..
- September 28, 2016
పండుగ కానుకగా రైల్వే సిబ్బందికి ఈ ఏడాది కూడా 78రోజుల బోనస్ ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకతతో ముడిపడి ఉన్న బోనస్(పీఎల్బీ) ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. గతేడాది వరకు పీఎల్బీపై ఉన్న పరిమితి రూ.3,500 నుంచి రూ.7వేలకు పెరగడంతో.. ఈ ఏడాది ఉద్యోగులకు దాదాపు రూ.18వేల చొప్పున బోనస్ లభించనుంది. ఈ బోనస్తో దాదాపు 13లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లాభం చేకూరనుంది. ఈసారి బోనస్తో రైల్వేపై దాదాపు రూ.2వేల కోట్ల అదనపు భారం పడనుంది. గత నాలుగేళ్లలోనూ రైల్వే సిబ్బందికి 78రోజుల వేతనాన్ని బోనస్గా అందిస్తున్నారు.దసరా పండగ ముందే బోనస్ ఇస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







