బహ్రెయిన్ యన్.ఆర్.ఐ కి ఘనసన్మానం

- August 12, 2015 , by Maagulf
బహ్రెయిన్  యన్.ఆర్.ఐ కి ఘనసన్మానం

బహ్రెయిన్ NRI శ్రీ RV.RAO గారు శ్రీమతి వకుళా దేవి గారు శ్రీ మధ్భగవథ్గీత ఫౌండేషన్ 17 వ అధ్యాయం "శ్రద్ద త్రయ విభాగ యోగము"కు తన వంతు ధనసాహయాన్ని అందించారు.ఈ AUDIO LAUNCH శిల్పకళా వేదిక నందు  హైదరాబాద్ లో అతిరధ మహారధులు మద్య కన్నుల పండుగ గా  జరిగింది ఇందులో భాగము గా శ్రీ RV.RAO గారు దంపతులు ను ఘనము గా ప్రముఖులు  సన్మానించారు. భగవత్గీత ఒక మధుర ఘట్టము .. అలాగే భగవత్గీత ఒక మ్రత గ్రంథము కాదు ఒక జ్ఞాన గ్రంథం "700 శ్లోకాల సంపూర్ణ గీతగానము "శ్రీ గంగధార శాస్త్రి గారు. ఒక గాయకుడు స్వీయ సంగీతము లో ఒక ప్రామాణిక గ్రంధాన్ని తాత్పర్య  సహితంగా సంపూర్ణము గా గానము చేసి అత్యున్నత సాంకేతిక విలువలు తో రికార్డ్ చెయ్యడము భారతదేశ సంగీత చరిత్ర లో ఇదే ప్రధమము .ఇంతటి మధుర ఘట్టము లో పాలు పంచుకోవడము నా పూర్వ జన్మ సుకృతము గా భావిస్తున్నాను అని RV.RAO గారు  మా ప్రతినిధి వాసుదేవ రావు గారు తో చెప్పారు అలాగే ఆయన మాట్లాడుతూ "ముఖ్యము గ విధ్యార్థులుకు యువతకు ఆదర్శ ప్రాయము గ ఆనంద మయము గ మానసిక ఒత్తిడులుకు గురైన వారికి విశ్రాంతి కలిగిస్తుంది అలాగే జీవితము లో ఎదురయ్యే అనేక సమస్యలుకు పరిష్కారము చూపించే మార్గదర్శి "భగవద్గీత "అని అన్నారు . ఈ 17 వ అధ్యాయము మా తల్లిదండ్రులుకు అంకితము చేస్తున్నాను అని చెప్పారు.

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com