మహేష్ జెడ్ స్వీడుతో సినిమాలు చేసేందుకు రెడీ..
- September 28, 2016
సూపర్ స్టార్ మహేష్ బాబు స్వీడు పెంచాడు. వరుసగా సినిమాలని లైన్లో పెట్టేశాడు. ఇక, వచ్చే యేడాది 2017లో ప్రిన్స్ ఏకంగా మూడు సినిమాలని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు మురగదాస్ సినిమాతో బిజిగా ఉన్నాడు. ఈ చిత్రం మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. ఇప్పటికే 40శాతం పైగా షూటింగ్ పూర్తయ్యింది. ఈ చిత్రాన్ని జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ చిత్రం తర్వాత మహేష్ మళ్లీ దర్శకుడు కొరటాల శివతో జతకట్టనున్నాడు. ఇప్పటికే 'శ్రీమంతుడు' మహేష్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కొరటాల. ఇప్పుడు మహేష్ కోసం మరో అద్భుతమైన కథని రెడీ చేశాడట.ఇందులో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. కొరటాల చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి చిత్రంలో మహేష్ నటించనున్నాడు. వంశీ చిత్రాన్ని కూడా ప్రిబ్రవరి లేదా మార్చిలో మొదలెట్టేందుకు మహేష్ రెడీ అవుతున్నట్టు సమాచారమ్.
మురగదాస్, కొరటాల, వంశీ పైడిపల్లి లతో చేయబోయే సినిమాలని 2017 రిలీజ్ చేసిందుకు ప్రిన్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఇదిగాక, పూరి చిత్రాన్ని కూడా ఇదే యేదాది పట్టాలెక్కించనున్నాడు. మొత్తానికి మహేష్ జెడ్ స్వీడుతో సినిమాలు చేసేందుకు రెడీ అయినట్టు కనబడుతోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







