చైనాను మెగీ తుపాను ముంచెత్తుతోంది..
- September 28, 2016
చైనాను మెగీ తుపాను ముంచెత్తుతోంది. రెండు రోజుల పాటు తైవాన్ను వణికించిన మెగీ తుపాను బుధవారం చైనాకు మళ్లింది. తుపాను కారణంగా జీజాంగ్ ప్రావిన్స్లోని సుకున్ గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 32 మంది గల్లంతయ్యారు. గ్రామంలోని ఇళ్లు పూర్తిగా నీటమునిగాయి. సహాయక బృందాలు ఇప్పటివరకు 15 మందిని కాపాడాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చేపడుతున్నారు. రెండ్రోజుల పాటు ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే నెలలో చైనాలో బీభత్సం సృష్టించిన మెరంటి టైఫూన్ కారణంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







