భారత్ దాడులకు మద్దతిచ్చిన బలూచ్ అధికారి.

- September 29, 2016 , by Maagulf
భారత్ దాడులకు మద్దతిచ్చిన బలూచ్ అధికారి.

ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్‌ తీసుకునే చర్యలు సరైనవే అని, భారత్‌కు బలూచిస్థాన్‌ మద్దతుగా ఉంటుందని బలూచ్‌ నేత మజ్దక్‌ దిల్షాద్‌ బలూచ్‌ వెల్లడించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భారత్‌ సరిహద్దు వెంబడి ఉగ్రస్థావరాలపై దాడులు జరపడంపై ఆయన మద్దతు ప్రకటించారు. పాకిస్థాన్‌ నుంచి బలూచిస్థాన్‌కు స్వతంత్య్రం కావాలని అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటానికి భారత ప్రభుత్వం మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
భారత సైన్యం ఈ తరహా లక్షిత దాడులను పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లోనూ నిర్వహించాలని మజ్దక్‌ పేర్కొన్నారు. ఈరోజు ఆల్‌ ఇండియా బలూచ్‌ యూనిటీ ఫోరం మద్దతుదారులు దిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. నేడు భారత సైన్యం పాక్‌లోని ఉగ్రస్థావరాలపై లక్షిత దాడులు చేసినట్లు ప్రకటించడంతో బలూచ్‌ నేత మజ్దక్‌ భారత్‌కు మద్దతు తెలుపుతూ వ్యాఖ్యలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com