ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపిన భారత సేన

- September 29, 2016 , by Maagulf
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపిన భారత సేన

నియంత్రణ రేఖ వెంబడి సైన్యం చేపట్టిన లక్షిత దాడుల్లో 38 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. దాదాపు నాలుగు గంటల పాటు చేసిన దాడుల్లో ఏడు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి.. 38 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే దీనిపై సైనికాధికారుల నుంచి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ.. విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ సమాచారమందిందని మీడయా సంస్థలు పేర్కొన్నాయి. గత అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి తెల్లవారుజామున 4.30 గంటల వరకు లక్షిత దాడులు చేపట్టామని మిలిటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ రణబీర్‌సింగ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com